మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో 250 ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు రేపు ఉదయం 10:30 గంటలకు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్, పిల్లలమర్రి రోడ్ మహబూబ్నగర్లో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ తెలిపారు. టెన్త్, ఆపై చదివిన 18 – 30 ఏళ్ల యువత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో హాజరుకావాలని అన్నారు.