WNP: ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులు 4 లేబర్ కోడ్స్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కోడ్స్ కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని సోమవారం డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.