SRCL: వార్డు సభ్యులు పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో రాధా అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఇటీవల నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు కూడా కీలక పాత్ర వహిస్తారని తెలిపారు.