NZB: పర్యావరణ పరిరక్షణ ప్రతీ పౌరుడి బాధ్యత అని, భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతి సంరక్షకులుగా మారాలని NZB జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలో పర్యావరణ వారోత్సవాలు ప్రారంభించారు. జిల్లాలో అటవీకరణను పెంచేందుకు సారంగపూర్ అర్బన్ పార్క్, పర్యాటక ప్రాజెక్టులను అటవీ శాఖ అభివృద్ధి చేస్తోందన్నారు.