NLG: ఓపెన్ స్కూల్ ఇంటర్ పదవ తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 20 నుంచి 27 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షలు 28 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు ఇంటర్లో 2226, పదో తరగతిలో 1611 మంది పరీక్ష రాయనున్నారు.