TPT: నారాయణవనం మండలంలో ఎండలు పెరిగాయి. ఈనేపథ్యంలో పాలమంగళం దక్షిణ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ అభివృద్ధి అధికారి ఆనంద్ కోరారు.