VZM: నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త సింగంపల్లి ఎర్నిబాబుకు వెలుగు డి.ఆర్.డి. ఏ ద్వారా మంజూరైన సుమారు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ను అందజేశారు.