ATP: అనంతపురం ఆర్డీటీ సేవల కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సంస్థ ప్రతినిధులు మాంచో ఫెర్రర్, విశాలా ఫెర్రర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆర్డీటీ విశిష్ట సేవలు అందిస్తోందని ఎంపీ కొనియాడారు. ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.