KDP: రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి తాగునీరు, విద్యుత్, రోడ్లు, పింఛన్లు, భూ వివాదాలు వంటి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.