రాత్రి ఎనిమిది గంటలు నిద్రించినా మర్నాడు నీరసంగా ఉంటే అది ఐరన్ లోపం లేదా థైరాయిడ్ లేదా స్లీప్ అప్నియా కావొచ్చు. దీన్ని నివారించడానికి పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. పడకగదిలో ఫోన్ వాడకం తగ్గించి, వెలుతురు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.