SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో మంగళవారం ఎస్సై వేముల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.