KMM: పశువులకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ముదిగొండ మండల పశువైద్యాధికారి అశోక్ అన్నారు. బుధవారం న్యూ లక్ష్మీపురం, ఖానాపురం, పెద్దమండవ గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించి పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. టీకాలు వేయడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.