SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని 29వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్, సంత్ నిరంకారి మిషన్ వారు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇళ్లలోనే వేరుచేసి అందజేయాలన్నారు.