భారత బౌలర్ బుమ్రా కీలక మైలురాయికి ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 116 వికెట్లు పడగొట్టిన అతను.. రేపు ఇంగ్లండ్పై ఒక్కరినీ ఔట్ చేసినా, భారత్ తరఫున 500 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తాడు. కుంబ్లే(953), అశ్విన్(765), హర్భజన్(707), కపిల్(687), రవీంద్ర జడేజా(634), జహీర్(597), శ్రీనాథ్(551) ఇప్పటికే ఈ క్లబ్లో ఉన్నారు.