IPL 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం వెనుక హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాస్టర్ ప్లాన్ ఉంది. సాధారణంగా PBKS తరఫున వన్డౌన్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వస్తాడు. కానీ అనూహ్యంగా కూపర్ కనోలీ బరిలోకి దిగి కీలక ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించాడు. పాంటింగ్ ప్రయోగించిన ‘నంబర్ 3’ అస్త్రం విజయవంతమైంది.