RCBపై వైభవ్ సూర్యవంశీ 78 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ.. తాను ఆడుతున్నప్పుడు బౌలింగ్ వేసేది ఎవరనేది చూడనని చెప్పాడు. బౌలర్ ఎవరైనా సరే తాను భయపడనన్నాడు. RR సపోర్టింగ్ స్టాఫ్ రోహిత్ తన మెంటార్ అని తెలిపాడు. తనకు ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని, కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన తనకు చెబుతుంటారని అన్నాడు.