AP: బనగానపల్లె బీసీ కాలనీలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. నిరుపేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతీ నెల ఒకటవ తేదీనే పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.