TG: BRS హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ కేవలం కాసుల కోసమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం ఇచ్చిన ఘనత UPAదేనని గుర్తు చేశారు. గొల్లపల్లి ప్రాజెక్టు విషయంలో BRS నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని తమను విమర్శించడం హాస్యాస్పదమని చెప్పారు.