TG: ఇబ్రహీంపట్నం మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డికి ఇవాళ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో విచారణకు హాజరై తమ వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.