AP: ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు. గుంటూరు ఈదులపాలెంలోని కాటూరి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డేకు గవర్నర్ హాజరై ప్రసంగించారు. కాటూరి మెడికల్ కళాశాలను అద్భుతంగా నిర్మించారని, సూపర్ స్పెషాలిటీ మాదిరిగా మంచి వైద్యం అందిస్తున్నారని ప్రశంసించారు. మంచి ప్రకృతిలో కాలేజీని ఏర్పాటు చేశారని తెలిపారు.