AP: రాష్ట్ర ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్రలో వడగాలులు వీస్తాయని, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 16 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రేపు మరో 19 మండలాల్లో వడగాలులు, ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.