TG: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 16న ఉదయం 11:45 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.