TG: సీఎం రేవంత్ రెడ్డికి BRS నేత బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలో క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ గడ్డి మందును నిషేధించాయి. తెలంగాణలో కూడా గడ్డిమందు నిషేధంపై ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన మెజార్టీ రైతుల్లో.. గడ్డిమందును వాడిన వారే ఎక్కువ’ అని లేఖలో పేర్కొన్నారు.