TPT: శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది.సేవలో పాల్గొనడానికి రూ. 516 టికెట్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఆలయంలో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు నిత్య కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
ELR: జంగారెడ్డిగూడెం మండలంలోని ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ఉండ్రాజవరపు శివకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది జూలైలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆర్వీఎస్ మురళీకృష్ణ నేరం రుజువు కావడంతో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విదిస్తూ తీర్పు వెల్లడించారు.
AKP: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద దాడిని అందరూ ఖండించాలని సీఐటీయూ విజ్ఞప్తి చేసింది. అచ్యుతాపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు CITU జిల్లా కార్యదర్శి ఆర్ రాము మాట్లాడుతూ.. దాడిని అత్యధిక శాతం మంది అమెరికన్లు కూడా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడులను కేంద్ర ప్రభుత్వం ఖండించాలన్నారు.
NLR: బుచ్చి మండలం ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు విప్పగుంట విజయభాస్కర్ రెడ్డిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ మేనేజర్ కల్లూరు విజయకుమార్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. పార్టీలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున పార్టీ క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
CTR: వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా పుంగనూరు కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సాయంత్రం 7గంటల నుంచి 9 గంటల వరకు ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు హాజరుకావాలని కోరారు.
TPT: తిరుపతి SV యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ క్యార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు కంపెనీల ప్రతినిధులు హాజరై ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. మొత్తం 650 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ASR: అరకులోయలోని గిరిజన మ్యూజియం పర్యాటకుల రాక తగ్గడంతో వెలవెలబోతోంది. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతుండటంతో పర్యాటకుల సందర్శన గణనీయంగా తగ్గినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు. సాధారణ రోజుల్లో సందర్శకులతో కిటకిటలాడే మ్యూజియం ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తోంది. అరకులోయలోని ఇతర పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
SKLM: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర మృతికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాదులో శనివారం సంతాపం తెలిపారు. ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా MLC మాట్లాడుతూ.. హెచ్జే దొర పోలీస్ శాఖలో చేసిన సేవలు మరువలేమన్నారు. శుక్రవారం ఆయన తుది శ్వాస హైదరాబాదులో విడిచిన సంగతి తెలిసిందే.
W.G. తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రధాన సెంటర్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని పేర్కొన్నారు.
VZM: గజపతినగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ మంత్రి జనసేన PAC సభ్యురాలు పడాల అరుణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రోజురోజుకు బలపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధ రావు (జగన్), తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: వంట గ్యాస్ కొరత ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను నమ్మవద్దని సోమందేపల్లి హెచ్పీ గ్యాస్ డీలర్ లోకేశ్ శనివారం తెలిపారు. సోమందేపల్లిలో గృహ వినియోగదారులకు ఎలాంటి గ్యాస్ కొరత లేదని, శనివారం నుంచి హెచ్పీ గ్యాస్ సిలిండర్లను వినియోగదారుల ఇళ్ల వద్దకే డోర్ డెలివరీ ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో రెల్లిహక్కుల పోరాట సమితి సమావేశం శనివారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు మాట్లాడుతూ.. అన్ని రంగాలలో అభివృద్ధికి నోసుకొని రెల్లిలకు సామాజిక సమన్యాయం జరగాలంటే వర్గీకరణ పునః పరిశీలన జరగాలని డిమాండ్ చేశారు. రెల్లిలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి, నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.
PPM: మొండెంఖల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు ఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇంటికుప్పల రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఇవాళ పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ద్వారానే మంచి భవిష్యత్తు నిర్మాణమవుతుందని అన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ATP: మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో ఉరవకొండ నియోజకవర్గంలోని 74 మంది లబ్ధిదారులకు రూ.43.37 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను టీడీపీ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. పెద్ద కౌకుంట్ల గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన & క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటి పర్యటన చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు యండపల్లి కాలభైరవ స్వామి దేవస్థానం కార్యక్రమంలో, సాయంత్రం 4:00 గంటలకు మాధవరం మూలపల్లిలో ముడి రఘుపతి నాయుడు కుటుంబాన్ని పరామర్శించగా, సాయంత్రం 5:00 గంటలకు చెన్నముక్కపల్లి మస్జిద్-ఏ-సఫురా వద్ద ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.