కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్ వెళ్లిన పవన్ తిరిగి గన్నవరం చేరుకున్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ATP: గుంటూరులోని హిందూ కళాశాలలో ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 1984 -87లో బీఎస్సీ జువాలజీ విభాగంలో డిగ్రీ,ఈ కళాశాలలో చదివినందుకు చాలా గర్వంగా ఉందని 37 సంవత్సరాల తర్వాత ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు.
NDL: గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా నంద్యాల మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ ప్యాసింజర్ రైలు(17228)ను 10రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26 వరకు రద్దు చేశారు. డోన్-గుంటూరు రైలును 17- 27 వరకు రద్దు చేశారు. పూరి – గిద్దలూరు – యశ్వంత్ పూర్ (22883) రైలును డోన్ మీదుగా వెళ్లట్లేదని తెలిపారు.
NDL: గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా నంద్యాల మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ ప్యాసింజర్ రైలు(17228)ను 10రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26 వరకు రద్దు చేశారు. డోన్-గుంటూరు రైలును 17- 27 వరకు రద్దు చేశారు. పూరి – గిద్దలూరు – యశ్వంత్ పూర్ (22883) రైలును డోన్ మీదుగా వెళ్లట్లేదని తెలిపారు.
VZM: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వర్ధంతిని విజయనగరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్బంగా ఎ.అర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకోసం ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించారన్నారు.
NDL: అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ అన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతిధులు పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.
NDL: జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం ఆలయంలో ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, పండితుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అభిషేక, అర్చనలు భక్తిశ్రద్ధలతో చేశారు. సుదర్శన హోమంలో పలు ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి అనుగ్రహం పొందారు.
W.G: ఆకివీడు గ్రామంలో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. శాసనసభ ఉప సభాపతి, ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు.
CTR: శ్రీరంగరాజపురం మండలం చిన్నతయ్యూరు హరిజనవాడ గ్రామ శివారులలో ఎక్సైజ్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1200 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేసినట్లు చెప్పారు. చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ సీఐ జవహర్ బాబు మాట్లాడుతూ.. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ATP: గోరంట్ల పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
PLD: నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో ఈనెల 17 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆదివారం మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు తెలియజేశారు. 18,19, 20 వరకు నిర్వహించే ఆధార క్యాంపులను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రకాష్ నగర్ -2 సచివాలయం, రంగా స్ట్రీట్ సచివాలయం-2లో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
VSP: విశాఖలో మద్దిలపాలెంలో వైసీపీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు, వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి మోసాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వరదు కళ్యాణి, మేయర్ హరి వెంకటకుమారి, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు ఉన్నారు.
PPM: బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ ప్రసంశించారు. ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు, పటేల్ వర్ధంతి కార్యక్రమం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
PLD: జనసేన గురజాల నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్ను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అభినందించారు. ఆదివారం పిడుగురాళ్ల పట్టణ టీడీపీ కార్యాలయంలో వెంకట్ను యరపతినేని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాత్రికేయ రంగంలో సీనియర్ జర్నలిస్ట్కి అధికార ప్రతినిధి పదవి రావడం సంతోషకరమన్నారు.
PLD: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలు ఆనిర్వచనీయమని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రహదారిలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు.