మార్కాపురం జిల్లాలో టిప్పర్-బస్సు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారి వివరాలు తెలుసుకోవడానికి ఆర్డీవో ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఏదైనా సమాచారం కోసం విష్ణువర్ధన్ (6304285613), కిషోర్ (9985733999), రాఘవేంద్ర (7989537285) నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు.