E.G: జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహింస్తున్న సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్తో ధరలలో దాదాపు 7% ఆదా అవుతుందన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకుడు కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని కలిసిన కార్మికులు, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బదిలీ కార్మికులను, తొలగించిన బాబును పనిలో కొనసాగించాలని, ఎంఎంఆర్ బదిలీ, కోవిడ్ కార్మికులను ఆప్కాస్లో చేర్చాలని కోరారు.
SKLM: గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సారవకోట మండలం కేసి రోడ్డు నుండి సవర కురిడింగి వరకు రూ.65 లక్షలతో నిర్మించిన తారు రోడ్డును కేంద్ర మంత్రితో పాటు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
VZM: ఈనెల 20వ తేదీన సోమవారం దీపావళి పండగ సందర్బంగా కలెక్టరెట్లో జరగనున్న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి శనివారం ప్రకటించారు. తదుపరి వారం నుండి PGRS యధావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈ వారం PGRS రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి వ్యయ ప్రయాసలకు ఓర్చి కలెక్టరెట్కు రావద్దని సూచించారు.
VZM: నగర పంచాయతీ, రూరల్ మండలంలోని గ్రామాల్లో ఎక్కడైనా దీపావళి రోజున జువ్వల పోటీలకు పాల్పడే యువతపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గణేష్ హెచ్చరించారు. నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట, మొయిద జంక్షన్, రామతీర్థం జంక్షన్తో పాటు సారిపల్లి గ్రామంలో జువ్వల పోటీలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆయా ప్రాంతాలపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
NLR: 28వ డివిజన్లో స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక మొక్కను నాటాలని తెలిపారు. అనంతరం జిల్లా నాయకులు తిరుపతి నాయుడు, శివ, సూరిబాబు, కుమార్, పుష్ప రాజ్, శానిటేషన్ ఏఈ కృష్ణ చైతన్య సెక్రటేరియట్ దివ్య 28వ డివిజన్ పరిధిలోని పలు వీధుల్లో మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు.
PLD: జిల్లా ప్రజలు దీపావళి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా కోరారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం శబ్ద కాలుష్య రహిత దీపావళి మందులను ఉపయోగించాలని సూచించారు. దీపావళి అంటే వెలుగుల పండుగే తప్ప, శబ్దాల పండుగ కాదన్నారు. బాణసంచా కాల్చే సమయంలో చిన్నారులు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కృష్ణా: ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 55 మంది లబ్ధిదారులకు రూ.16,00,258లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందచేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికి 682 మందికి రూ.5,05,34,621 సహాయం అందచేశామన్నారు.
సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం పోతుకుంట బీసీ కాలనీలోని టీడీపీ కార్యకర్త నరసింహులు ఇటీవల ప్రమాదంలో మరణించారు. పార్టీ సభ్యత్వం ఉండటంతో టీడీపీ తరఫున రూ. 5 లక్షల బీమా మంజూరైంది. ఆ మొత్తాన్ని నరసింహులు సతీమణి లక్ష్మికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ను అందజేశారు. బాధితురాలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పరిటాల శ్రీరామ్కు కృతజ్ఞతలు తెలిపారు.
సత్యసాయి: లేపాక్షి మండలంలోని అంబేద్కర్ సర్కిల్లో జర్నలిస్టులు, వైసీపీ నాయకులు ఇవాళ ధర్నా నిర్వహించారు. సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని అక్రమంగా సాక్షి కార్యాలయంలో సోదాలు జరిపి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారని జర్నలిస్టులు మండిపడ్డారు. వెంటనే విలేకరులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
KDP: ఈ సంవత్సరం ప్రకృతి వైపరిత్యాల వల్ల అధిక వర్షంతో మైదుకూరు మండలం పప్పనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల పంట పొలాల్లో నీరు నిలవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏ వి.రమణ పేర్కొన్నారు. ఈ వర్షపు నీరు తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
VZM: దీపావళి పండుగ వెలుగుల పండుగగా, చెడుపై మేలును ప్రతిబింబించే మహోత్సవంగా మన దేశ సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కలెక్టర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంటిలో ఆనందం, సౌభాగ్యం, సుఖశాంతులు నిండాలన్నారు.
NTR: కొత్త ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రైవేట్ అంబులెన్స్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. జిల్లా దాటి మృతదేహాలను తరలించేందుకు, రాజేశ్ అనే వ్యక్తికి చెందిన అంబులెన్సుల ఏజెంట్ నజీర్ చెప్పిందే రేటు. ఈ మేరకు మహాప్రస్థానం వాహనాలు కృష్ణా జిల్లా వరకే ఉండటంతో, గుంటూరుకు ₹4వేలు, ఏలూరుకు ₹5,500 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
GNTR: హై రిస్క్ గర్భిణీల పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ. తమియా అన్సారి స్పష్టం చేశారు. గర్భం దాల్చిన వెంటనే నమోదు కావాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణీల్లో రక్త హీనత లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్, చెక్లను పంపిణీ చేశారు.
ASR: గిరిజన ప్రాంతంలో హిందూ ధర్మ రక్షణకు కృషి చేద్దామని బీజేవైఎం అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండబాబు పిలుపునిచ్చారు. శనివారం హుకుంపేట మండలం గత్తుం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించుకోవాలని సూచించారు.