• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీరాములకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్

అనంతపురం నగరంలోని స్థానిక రెవెన్యూ భవనంలో ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

December 15, 2024 / 02:40 PM IST

ఆంజనేయస్వామి రథోత్సవంలో పాల్గొన్న టీడీపీనేత దివాకర్ రెడ్డి

కర్నూలు: కోసిగి మండలం సజ్జలగుడంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవంలో ఆదివారం మంత్రాలయం టీడీపీ నేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కుమారుడు ప్యాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు, ప్రసాదం అందజేశారు. ఆయనతో పాటు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

December 15, 2024 / 02:36 PM IST

తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించిన యరపతినేని

GNTR: గురజాల శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఏర్పాట్లను పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌లో యరపతినేని కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

December 15, 2024 / 02:36 PM IST

హలో మాల-చలో గుంటూరుకు వెళ్లిన అంబేడ్కర్ యూత్

కృష్ణా: ఎస్సీ వర్గీకరణకు వలన జరిగే అనార్థాలకు వ్యతిరేకంగా గుంటూరులో జరిగే హలో మాల చలో గుంటూరు మహా గర్జనకు నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామం నుంచి అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో వేలాది తరలి వెళ్లారు. కార్యక్రమంలో అంబేడ్కర్ అభిమానులు, అంబేడ్కర్ యువత, మహిళలు, మాలసంఘం నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

December 15, 2024 / 02:34 PM IST

గుత్తిలో సర్దార్ వల్లభాయ్ పట్టీలకు ఘన నివాళి

ATP: గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలోఆదివారం పెన్షనర్స్ నాయకులు అబూబకర్, కుల్లాయి బాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుల్లాయి బాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.

December 15, 2024 / 02:33 PM IST

పొట్టి శ్రీరాములు త్యాగాలు అజరామరం: జేసీ

NLR: కలెక్టరేట్‌లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్ రావు, పాల్గొని అమరజీవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రపై సమాచార శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక వీడియోను తిలకించారు.

December 15, 2024 / 02:28 PM IST

ఎస్సీ వర్గీకరణ కోసం ఐక్యంగా పోరాడుదాం

NLR: నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ భవన్‌లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ మాదిగ సంఘాల నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతి ఒక్కరు విభేదాలను వీడి ఐక్యంగా పోరాడాలని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య, మాదిగ జేఏసీ నేత గడ్డం శేఖర్‌లు పిలుపునిచ్చారు.

December 15, 2024 / 02:23 PM IST

శారీరక దారుఢ్య పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి

SKLM: పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా శారీరక అర్హత దారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎచ్చెర్లలో ఉన్న జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానం ఆయన పరిశీలించారు. శారీరిక దారుర్య పరీక్షలు నిర్వహణకు ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు జరగాలని అధికారులను సూచించారు.

December 15, 2024 / 02:22 PM IST

కొల్లు రవీంద్రని పరామర్శించిన బీసీ నాయకులు

కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ ఇటీవల మృతిచెందారు. ఆదివారం తిరువూరు నియోజకవర్గ టీడీపీ బీసీ నాయకులు మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర కార్యాలయానికి వెళ్లి మంత్రిని పరామర్శించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు శేషగిరిరావు, మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ హుస్సేన్, శ్రీనివాసరావు, శీను, తదితరులు పాల్గొన్నారు.

December 15, 2024 / 02:21 PM IST

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే బుడ్డా

 KRNL: శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ వేద పండితులు, ఈవో శ్రీనివాస రావు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ఇరుముడి సమర్పించి, శివదీక్షను విరమించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.

December 15, 2024 / 02:19 PM IST

‘నేడు శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు’

కడప నగర శివారు పరిధిలోని శిల్పారామంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామ పరిపాలనాధికారి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా.. కళావేదికపై సాయంత్రం 6:15 నిమిషాలకు పులివెందులకు చెందిన ఓ డాన్స్ అకాడమీ బృందంచే శాస్త్రీయ, సినీ, జానపద గీతాలకు చిన్నారులు నృత్యాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

December 15, 2024 / 02:11 PM IST

గురజాలలో శాఖాహారమే తినాలంటూ ర్యాలీ

GNTR: గురజాల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో శ్రీ త్రిపురాంతక లుంబినీ పిరమిడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవులు ప్రతి ఒక్కరూ మాంసాహారం వద్దు శాఖాహారమే తినాలి అంటూ శాఖాహార మద్దతుదారులు ప్లకార్డులతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖహారులు మానవులు ఏ జీవిని చంపే హక్కు లేదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

December 15, 2024 / 02:05 PM IST

రేపు పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

KKD: ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం నియోజక వర్గం స్థాయిలో పిఠాపురంలో ఈ నెల16, సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి 01:00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

December 15, 2024 / 02:04 PM IST

‘పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన శాసనమండలి ఛైర్మన్’

W.G: భీమవరం పట్టణంలోని మావుళ్ళమ్మ ఆలయం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయనను మరవదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

December 15, 2024 / 01:53 PM IST

‘పేదల వైద్యానికి కేంద్రం ప్రాధాన్యత’

W.G: పేదల వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఈతకోట తాతాజీ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణ కడగట్ల జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

December 15, 2024 / 01:48 PM IST