E.G: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జీవితాన్ని అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం అన్నారు. ఐటీడీఏ సమావేశహాల్లో ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రజలు అంతా పొట్టి శ్రీరాములను తరతరాలుగా గుర్తించుకోవాలన్నారు.
KDP: రోడ్డు ప్రమాదాలు,అరికట్టేందుకు సిద్ధవటం పోలీసులు, హై లెవెల్ వంతెనపై రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టి, కుప్పలు, ముళ్ళ చెట్లను ఆదివారం డోజర్ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ రమణ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు బద్వేల్, కడప రహదారి, పోలీస్ లైన్ మలుపు వద్ద, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను తొలగించామన్నారు.
KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం 13వ వార్డులో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా పర్యటించారు. అనంతరం ఆయన వార్డు ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న తనకు వెంటనే తెలియచేయాలని, ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని 13వ వార్డు ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.
VSP: వీఏంఆర్డీఏలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వీఏంఆర్డీఏ ఛైర్పర్సన్ ఎంవీ.ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఏంఆర్డీఏకి సంబంధించిన అన్ని రకాల సమస్యలపై ప్రజలు వినతులు అందజేయవచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రణవ్ గోపాల్ నేరుగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తానని తెలిపారు.
ELR: రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా ఆదివారం పోలవరంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. హెలిప్యాడ్ మొదలు పోలవరం ప్రాజెక్ట్ మరియు బహిరంగ సభ వరకు పోలీసులు నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులకు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల లేసి కలెక్టర్ నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భాషా ప్రయోక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అన్నారు.
W.G: కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆకివీడులో ఉన్న విగ్రహానికి సందర్శించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్ర రాష్ట్రానికి ఒక మైలురాయిని అంటూ ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం నగరంలోని స్థానిక రెవెన్యూ భవనంలో ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కర్నూలు: కోసిగి మండలం సజ్జలగుడంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవంలో ఆదివారం మంత్రాలయం టీడీపీ నేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కుమారుడు ప్యాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు, ప్రసాదం అందజేశారు. ఆయనతో పాటు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
GNTR: గురజాల శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఏర్పాట్లను పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో యరపతినేని కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కృష్ణా: ఎస్సీ వర్గీకరణకు వలన జరిగే అనార్థాలకు వ్యతిరేకంగా గుంటూరులో జరిగే హలో మాల చలో గుంటూరు మహా గర్జనకు నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామం నుంచి అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో వేలాది తరలి వెళ్లారు. కార్యక్రమంలో అంబేడ్కర్ అభిమానులు, అంబేడ్కర్ యువత, మహిళలు, మాలసంఘం నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ATP: గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలోఆదివారం పెన్షనర్స్ నాయకులు అబూబకర్, కుల్లాయి బాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుల్లాయి బాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.
NLR: కలెక్టరేట్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్ రావు, పాల్గొని అమరజీవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రపై సమాచార శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక వీడియోను తిలకించారు.
NLR: నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ భవన్లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ మాదిగ సంఘాల నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతి ఒక్కరు విభేదాలను వీడి ఐక్యంగా పోరాడాలని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య, మాదిగ జేఏసీ నేత గడ్డం శేఖర్లు పిలుపునిచ్చారు.
SKLM: పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా శారీరక అర్హత దారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎచ్చెర్లలో ఉన్న జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానం ఆయన పరిశీలించారు. శారీరిక దారుర్య పరీక్షలు నిర్వహణకు ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు జరగాలని అధికారులను సూచించారు.