• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలు రద్దు చేయాలి’

ASR: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాడేరు పర్యటనకు వచ్చే ముందే హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలు-2, 13, 51లను రద్దు చేయాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అరకులో మీడియాతో మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. ఆదివాసీ ప్రాంతంలో 100శాతం రిజర్వేషన్ చట్టం చేయాలన్నారు.

March 13, 2026 / 02:38 PM IST

కడుపునొప్పితో యువకుడు ఆత్మహత్య..!

నంద్యాల: జిల్లా బేతంచర్ల మండలంలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో బోయ శ్రీకాంత్ (35) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపునొప్పి తీవ్రంగా ఉండటంతో బాధను తట్టుకోలేక అత్తారింట్లో ఉరేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

March 13, 2026 / 02:37 PM IST

బీసీ కమ్యూనిటీ హాల్ శంఖుస్ధాపన చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణం 13వ వార్డులో ప్రజల చిరకాల కోరికైన బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు శుక్రవారం ఎమ్మెల్యే శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్ నూక దుర్గారాణి, తదితరులు పాల్గొన్నారు.

March 13, 2026 / 02:34 PM IST

ఆదోనిలో గ్యాస్ కొరత నిందితులపై చర్యలు..!

KRNL: ఆదోనిలో గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MLA పార్థసారథి శుక్రవారం హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ అవసరాల సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. వదంతులు నమ్మవద్దని, ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

March 13, 2026 / 02:33 PM IST

వరసిద్ధి వినాయక ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

SS: కదిరి పట్టణం తుమ్మల రోడ్డు అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. భక్తి భావంతో నిర్మించే ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

March 13, 2026 / 02:32 PM IST

పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరు

AKP: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 8,888 మంది హాజరు కావలసి ఉండగా 8,764 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

March 13, 2026 / 02:31 PM IST

విద్యార్థుల భద్రతకు పోలీసుల ప్రత్యేక గస్తీ..!

రైల్వే కోడూరులో విద్యార్థుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం పాఠశాలలకు వచ్చే చిన్నారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు చర్యగా ప్రతిరోజూ ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం పాఠశాల సమయాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ విద్యార్థులు సురక్షితంగా రోడ్డు దాటేలా సహాయం చేస్తున్నారు.

March 13, 2026 / 02:30 PM IST

చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరువూరులో ఎంపీడీవో కార్యాలయం వేదికగా చెత్త సేకరణ రిక్షాలను, డస్ట్ బిన్‌లను స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి ఈ పరికరాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

ఇంటర్ ఫిజిక్స్ పరీక్షకు 335 మంది గైర్హాజరు

TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్–II పరీక్ష శుక్రవారం జిల్లాలోని 84 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 24,313 మంది విద్యార్థులకు గాను 23,978 మంది హాజరుకాగా 335 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణతో పాటు త్రాగునీరు, మెడికల్ సిబ్బంది ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

March 13, 2026 / 02:30 PM IST

సీసీ రోడ్డు ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

WG: పాలకోడేరు మండలం గోరగనమూడిలో రూ. 82 లక్షల వ్యయంతో నిర్మించిన 2 కిలోమీటర్ల రూరల్ కనెక్టివిటీ సీసీ రోడ్డును డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రాజు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

‘గ్యాస్ బుకింగ్‌కు ప్రత్యామ్నాయ నెంబర్లు తీసుకొస్తాం’

E.G: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలెవరూ అనవసరంగా సిలిండర్లను నిల్వ చేసుకోవద్దని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సివిల్ సప్లయిస్ అధికారులు, డీలర్లతో చర్చిస్తున్నామని తెలిపారు. గ్యాస్ బుకింగ్‌కి ప్రత్యామ్నాయ నెంబర్లు తీసుకొస్తామని పేర్కొన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

ఇంటి పన్నులను సకాలంలో చెల్లించాలి: MDO

BPT: కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామంలో ఇంటి పన్ను వసూళ్లు కార్యక్రమాన్ని శుక్రవారం ఎండీవో రాజ్యలక్ష్మి పరిశీలించారు. ఇంటి పన్ను వసూలు అవుతున్న తీరును ఆమె పంచాయతీ సెక్రెటరీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీవో మాట్లాడుతూ.. ప్రజలు నిర్దేశించిన గడువులో ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

‘ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి’

కృష్ణా: ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శుక్రవారం అవనిగడ్డ మండలం వేకనూరులో ఎంవీ కృష్ణారావు శత జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా తరువాత గుండె, మెదడు సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

March 13, 2026 / 02:30 PM IST

పేదలకు వస్త్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ 22వ డివిజన్‌లో సయ్యద్ చాంద్ మాతృమూర్తి జ్ఞాపకార్థం పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పేదలకు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పేదలకు సేవ చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.

March 13, 2026 / 02:30 PM IST

మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యాలు

NDL: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలిపారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది రాకుండా గ్రీన్ మ్యాట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్ల కోసం సంబంధిత టెండర్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

March 13, 2026 / 02:27 PM IST