• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘కృతజ్ఞతలు తెలిపిన నీటి సంఘం అధ్యక్షులు’

ప్రకాశం: ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబును నూతన నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించినందుకు వాళ్ళు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై దృష్టి సారించాలని వారికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మేడపి, గంటవానిపల్లి, మానేపల్లి నాయకులు పాల్గొన్నారు.

December 15, 2024 / 03:19 PM IST

రాధా గోవింద ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే

SKLM: లావేరు మండలం పాతకుంకాం గ్రామంలో ఏర్పాటు చేసిన రాధాగోవింద మందిర ప్రతిష్టాపన మహోత్సవంలో ఆదివారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

December 15, 2024 / 03:17 PM IST

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

VZM: తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. ఆదివారం బాలాజి నగర్ జనసేన కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లబాయ్ పటేల్‌ల వర్ధంతి సందర్భంగా, ఆ మహానీయుల చిత్రపటాలకు పూల మాలలు వేసి అవనాపు విక్రమ్ నివాళ్లు అర్పించారు.

December 15, 2024 / 03:15 PM IST

బెల్లంకొండలో కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ 

PLD: బెల్లంకొండ అడ్డరోడ్డులో నిర్మిస్తున్న కళ్యాణ మండప నిర్మాణానికి ఆదివారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. బెల్లంకొండ అడ్డరోడ్లోని కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమంతరావు సీతమ్మలు కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

December 15, 2024 / 03:14 PM IST

గురజాలలో తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించిన యరపతినేని

PLD: గురజాల శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఏర్పాట్లను పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌లో యరపతినేని కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

December 15, 2024 / 03:10 PM IST

‘చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి’

ప్రకాశం: చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మార్కాపురం టౌన్, రూరల్ ఎస్సైలు సైదా బాబు, డాక్టర్ రాజమోహన్ రావు అన్నారు. ఆదివారం మార్కాపురంలోని ఓ పాఠశాలలోని బాస్కెట్‌బాల్, టెన్నిస్ కోట్లను వాళ్ళు ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.

December 15, 2024 / 03:09 PM IST

‘సొసైటీ ప్రెసిడెంట్‌లను అభినందించిన మాజీ ఎమ్మెల్యే’

W.G: నరసాపురం నియోజకవర్గం కేపీ పాలెం మత్యకార సొసైటీ ప్రెసిడెంట్‌గా బొడ్డు నారాయణ మూర్తి, మోళ్ళ పర్రు మత్యకార సొసైటీ ప్రెసిడెంట్‌గా అండ్రాజు శ్రీనివాస్, కాళీపట్నం సౌత్ మత్యకార సొసైటీ ప్రెసిడెంట్‌గా అండ్రాజు సుబ్బరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు.

December 15, 2024 / 03:08 PM IST

పాలకోడేరులో వైసీపీకి భారీ షాక్

W.G: పాలకోడేరు జెడ్పీటీసీ పెద్దిశెట్టి లక్ష్మీ తులసి, సుబ్రహ్మణ్యం దంపతులు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి ఆదివారం టీడీపీలో చేరారు. వారికి రఘురామ కృష్ణరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీసీ ఛైర్మన్ మంతెన రామరాజు, గంటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

December 15, 2024 / 03:07 PM IST

‘గొప్ప మహనీయులు పొట్టి శ్రీరాములు’

PPM: పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే గొప్ప మహనీయులని మాజీ ఎమ్మెల్యే అలజింగి జోగారవు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించి రాష్ట్రాన్ని సాధించారన్నారు.

December 15, 2024 / 03:03 PM IST

జాబ్‌మేళాకు వేలాది మంది యువత హాజరు

NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల ఆధ్వర్యంలో నెల్లూరులోని వీపీఆర్ కన్వన్షన్ హాల్లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. దేశంలోనే పేరొందిన 100 ప్రముఖ సంస్థల ప్రతినిధులతో జాబ్‌మేళాను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్‌మేళాకు హాజరయ్యారు.

December 15, 2024 / 03:00 PM IST

అమరజీవికి నివాళులు అర్పించిన తిరుపతి ఎస్పీ

CTR: అమరజీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ సుబ్బారాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీ రాష్ట్ర సాధన కోసం ఆయన నిబద్ధతను గుర్తించుకోవాలని తెలిపారు. ఆయన ధైర్యం, దృఢ విశ్వాసం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, నిస్వార్థత అలవర్చుకోవాలని సూచించారు.

December 15, 2024 / 02:55 PM IST

మహనీయుడు పొట్టి శ్రీరాములు

E.G: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జీవితాన్ని అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం అన్నారు. ఐటీడీఏ సమావేశహాల్లో ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రజలు అంతా పొట్టి శ్రీరాములను తరతరాలుగా గుర్తించుకోవాలన్నారు.

December 15, 2024 / 02:54 PM IST

ప్రమాదాలు అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు

KDP: రోడ్డు ప్రమాదాలు,అరికట్టేందుకు సిద్ధవటం పోలీసులు, హై లెవెల్ వంతెనపై రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టి, కుప్పలు, ముళ్ళ చెట్లను ఆదివారం డోజర్ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ రమణ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు బద్వేల్, కడప రహదారి, పోలీస్ లైన్ మలుపు వద్ద, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను తొలగించామన్నారు.

December 15, 2024 / 02:49 PM IST

13వ వార్డులో పర్యటించిన ఇర్ఫాన్ భాష

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం 13వ వార్డులో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా పర్యటించారు. అనంతరం ఆయన వార్డు ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న తనకు వెంటనే తెలియచేయాలని, ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని 13వ వార్డు ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.

December 15, 2024 / 02:48 PM IST

రేపు ప్రజా సమస్యల పరిష్కారవేదిక

VSP: వీఏంఆర్‌డీఏలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వీఏంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్ ఎంవీ.ప్రణవ్ గోపాల్ తెలిపారు.  వీఏంఆర్‌డీఏకి సంబంధించిన అన్ని రకాల సమస్యలపై ప్రజలు వినతులు అందజేయవచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రణవ్ గోపాల్ నేరుగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తానని తెలిపారు.

December 15, 2024 / 02:46 PM IST