E.G: నిడదవోలు మండలంలోని రావిమెట్ల గ్రామ శివారులో అక్రమంగా కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను సమిశ్రగూడెం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,000 నగదుతో పాటు ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా జూదం, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలన్నారు.