ATP: బ్రహ్మసముద్రం మండలం నంజాపురంలో తులసి అనే మహిళ మెడలో ఉన్న బంగారపు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. గురువారం ఆమె కళ్యాణదుర్గం నుంచి నంజాపురానికి స్కూటీలో బయలుదేరింది. గొంచిరెడ్డిపల్లి, ఐదుకల్లు గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు బైక్ లో వచ్చి మహిళ మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.