బాపట్ల జిల్లాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గంటల తరబడి బంకుల వద్ద బారులుతీరి క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారని, ఇది ముమ్మాటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ వైఫల్యమేనని సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో సోమవారం మండిపడ్డారు.