ELR: ఉపాధి హామీ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా పంచాయతీ రాజ్ వైసీపీ సెల్ అధ్యక్షుడు పుప్పాల గోపి అన్నారు. సోమవారం PGRSలో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. పనుల వద్ద నీరు, నీడ, మందుల సౌకర్యం కల్పించాలన్నారు.