• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పార్టీ బలోపేతమే లక్ష్యం: మాజీ మంత్రి

అన్నమయ్య:  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్య క్షుడు రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో వీరబల్లి మండల రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై చర్చించారు. గొడ్డిండ్ల వాండ్లపల్లి గ్రామస్థులు తమ సమస్యలను పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని తెలిపారు.

March 15, 2026 / 05:18 PM IST

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

PPM: నీలకంఠాపురం మండలంలోని పనసబద్ర గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను నీలకంఠాపురం ఎస్సై నీలకంఠారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్విన్‌పేట సీఐ హరి బాబు, పోలీసు సిబ్బందితో కలిసి టోర్నమెంట్ నిర్వాహకులకు క్రికెట్ బ్యాట్, వికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.

March 15, 2026 / 05:17 PM IST

పాఠశాల పైకప్పు నిర్మాణానికి పరిటాల శ్రీరామ్ హామీ

సత్యసాయి: ముదిగుబ్బ మండలం దొరిగల్లులో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చూసి ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్‌ స్పందించారు. పాఠశాల భవనాలు అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు చెట్ల కింద చదువుకుంటున్నారని తెలుసుకున్న ఆయన ఆదివారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. తన సొంత ఖర్చుతో పాఠశాలపై కప్పు నిర్మాణం చేపడతానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

March 15, 2026 / 05:17 PM IST

జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా ర్యాంక్ ఎంతంటే..!

KDP: జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి వైఎస్సార్ కడప జిల్లా రాష్ట్రంలో తొలి స్థానం సాధించింది. మార్చి 14న నిర్వహించిన లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 1,03,591 కేసులు పరిష్కరించగా రూ. 24.01 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 బెంచీలలో క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించబడ్డాయి.

March 15, 2026 / 05:15 PM IST

శ్రీకృష్ణ పీఠం మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

కర్నూలు: నంద్యాల చెక్‌పోస్ట్ సమీపంలోని శ్రీకృష్ణ పీఠంలో నిర్వహిస్తున్న 89వ విశ్వశాంతి మహాయాగంలో ఇవాళ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. దేశంలో శాంతి, ప్రజల సౌభాగ్యం కోసం మహాయాగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

March 15, 2026 / 05:14 PM IST

‘గ్యాస్ కోసం ఆందోళన అవసరం లేదు’

VSP: జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ విద్యాధరి ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్నకు రోజువారీ అవసరము 18,184 సిలిండర్లు కాగా 37,920 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుకింగ్ చేసుకోవాలనన్నారు

March 15, 2026 / 05:14 PM IST

రేపు యధావిధిగా పీజీఆర్ఎస్

W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1,100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.

March 15, 2026 / 05:12 PM IST

జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడిగా నాగమల్లేశ్వర్ రెడ్డి

ATP: వైసీపీ పార్టీ బూత్ కమిటీ విభాగం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన నాగమల్లేశ్వర్ రెడ్డిని నియమించారు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

March 15, 2026 / 05:11 PM IST

రేపు అమరజీవి జయంతి వేడుకలు: కలెక్టర్

ATP: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని, ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గ విజన్ యూనిట్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

March 15, 2026 / 05:11 PM IST

డ్రగ్స్ కేసులో ఎంపీపై వైసీపీ విమర్శలు

ఏలూరు: జిల్లాను డ్రగ్స్ రహితంగా మారుస్తానని చెప్పిన ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా మారడం సిగ్గుచేటని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఇవాళ ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ డ్రగ్స్ పార్టీగా మారిపోయిందని తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నాయని అన్నారు.

March 15, 2026 / 05:10 PM IST

రెండు ఎకరాల జీడి తోటలు దగ్ధం

AKP: రావికమతం మండలం టీ. అర్జాపురం పంచాయతీ డోలవానిపాలెంకు చెందిన డోల ఈశ్వరరావుకు సంబంధించి ఆదివారం ఉదయం రెండు ఎకరాల జీడి తోట దగ్ధమైంది. పోడు భూమిలో పది సంవత్సరాల నుంచి ఈశ్వరరావు జీడి తోటలను పెంచుతున్నాడు. అకస్మాత్తుగా మాటలు చెలరేగి పంట కాలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

March 15, 2026 / 05:07 PM IST

మాజీ మంత్రి రోజా పర్యటన షెడ్యూల్ ఇదే..!

CTR: మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం పుత్తూరు, నగరి, విజయపురం మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం నేసనూరులో శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో రుద్రాభిషేకంలో పాల్గొని, అనంతరం పలు గ్రామాల్లో కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం నగరిలో కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొనగా, సాయంత్రం విజయపురం మండలంలో YCP  నాయకుల కుటుంబాలను పరామర్శిస్తారు.

March 15, 2026 / 05:05 PM IST

రేపు సురుటుపల్లిలో నందీశ్వరునికి ప్రదోష పూజలు

TPT: నాగలాపురం (M) సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు నందీశ్వరునికి ప్రదోష పూజలు జరగనున్నట్లు ఈవో లత తెలిపారు. ప్రదోష అభిషేక పూజలకు కావలసిన పూజా సామాగ్రిని భక్తులు కానుకలుగా సమర్పించవచ్చన్నారు. ప్రదోష అభిషేక పూజలో పాల్గొని భక్తులు రూ.500 చెల్లించి టికెట్ పొందాలన్నారు.

March 15, 2026 / 05:01 PM IST

రౌడీషీటర్లకు సీఐ కౌన్సిలింగ్

GNTR: తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ సాంబశివరావు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, అల్లర్లు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా నేరాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని సీఐ సూచించారు.

March 15, 2026 / 04:58 PM IST

‘పట్టణాభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ కీలకం’

VSP: పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ అవసరమని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడారు. జూన్ నాటికి రాష్ట్రంలో 2.60 లక్షల గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రోపై సాంకేతిక ప్రక్రియలు రెండు నెలల్లో పూర్తవుతాయని, మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

March 15, 2026 / 04:58 PM IST