• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అధ్వాన్నంగా లక్కవరం రహదారి

కోనసీమ: మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ప్రధాన రహదారి అధ్వాన్నంగా తయారైంది . ఈ రోడ్డుపై పెద్ద గోతులు ఏర్పడడంతో ఆ గోతులలో వర్షం నీరు చేరి బురదమయం అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలిపోయే పరిస్తితి ఏర్పడింది. రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

October 12, 2025 / 04:30 PM IST

బ్రహ్మానందరెడ్డిని కలిసిన వైసీపీ ఇంఛార్జ్

ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డిని హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా కనిగిరిలో వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధిని గురించి వారిరువురు చర్చించుకోవడం జరిగింది. పార్టీ వృద్ధి కోసం చేస్తున్న కృషిని నారాయణ యాదవ్ వివరించడం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

October 12, 2025 / 04:29 PM IST

జడ్పీ ఛైర్మన్ పత్రికా సమావేశం

VZM: పేదవాళ్లు తాగే మద్యాన్ని టార్గెట్ చేసి టీడీపీ ప్రభుత్వం నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతోందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సప్లై చేసిన వ్యక్తిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదని, ఇదంతా నడింపించిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదన్నారు.

October 12, 2025 / 04:23 PM IST

నాగజ్యోతికి పతకాలు

AKP: బెంగుళూరులో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో రోలుగుంట ఉపాధ్యాయురాలు నాగజ్యోతి ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచారు. బెంచ్ ప్రెస్ విభాగంలో గోల్డ్ మెడల్, డెడ్ లిప్ట్ విభాగంలో గోల్డ్ మెడల్, టోటల్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు పుష్ పుల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.

October 12, 2025 / 04:19 PM IST

రేపటి మంత్రి సవిత పర్యటన వివరాలు

సత్యసాయి: రొద్దం మండలంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సోమవారం పర్యటించనున్నట్లు మండల మేజర్‌ పంచాయతీ కన్వీనర్‌ చిరంజీవి తెలిపారు. రొద్దం మండలం కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌‌పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

October 12, 2025 / 04:18 PM IST

అభివృద్ధిపై మంత్రి అచ్చెన్నాయుడు సూచనలు

SKLM: టెక్కలి మేజరు పంచాయతీ అభివృద్ధిపై ఆదివారం పంచాయతీ అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచనలు చేశారు. టెక్కలిలో స్పెషల్ శానిటేషన్ పనులు పటిష్ఠంగా చేయాలన్నారు. ప్రతీ వీధికి రక్షిత మంచినీటి సరఫరా, వీధి లైట్లు, రోడ్లపై కుక్కలు, ఆవుల సంచారాన్ని నియంత్రించాలన్నారు. పంచాయతీ ఆదాయానికి ఇంటి పనులు వసూళ్లు, సెస్‌లు సక్రమంగా వసూళ్లు చేయాలన్నారు.

October 12, 2025 / 04:10 PM IST

అనారోగ్య బాధితులకు అండగా నిలిచిన మంత్రి

కోనసీమ: వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక వ్యక్తికి, మరో చిన్నారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అండగా నిలిచి ఇరువురికి రూ. 30వేలు ఆర్థిక సహాయం అందించి ఆపన్న ఆస్తం అందించారు. వెల్ల సావరం గ్రామానికి చెందిన నందికొల్ల దుర్గాదేవికు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు, అద్దంపల్లి గ్రామానికి చెందిన రుద్రాక్షల వీరబాబుకు రూ. 20వేలు అందజేశారు.

October 12, 2025 / 04:03 PM IST

గుర్తు తెలియని వృద్ధుడి మృతి

కడప పరిధిలోని రిమ్స్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. రిమ్స్ ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా వృద్ధుడు అపస్మార్క స్థితిలో పడి ఉండడానికి గమనించిన సెక్యూరిటీ సిబ్బంది లోపలికి తీసుకెళ్ళుగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలేవీ తెలియదని వారు తెలిపారు.

October 12, 2025 / 04:03 PM IST

సంజామల మండలంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఆదివారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న బీసీ ఇందిరమ్మకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బీసీ ఇందిరమ్మ లోకేష్ రెడ్డి భార్గవి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆమె ఆశీర్వదించారు.

October 12, 2025 / 04:00 PM IST

పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించిన బీసీ నేత

E.G: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, జోన్-2 కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ ఆదివారం ఖండించారు. వేమగిరి కార్యాలయంలో భేటీగా, రవీంద్ర బీసీ వర్గాలకు అండగా నిలిచారని, ప్రజలకు స్ఫూర్తిదాయక సేవలు అందిస్తున్నారని తెలిపారు. పేర్ని నానిని నోరు అదుపులో ఉంచాలని సూచించారు.

October 12, 2025 / 04:00 PM IST

CMRF ఎల్వోసీ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరంలోని వివిధ గ్రామాలకు చెందిన రోగులకు వైద్య చికిత్స నిమిత్తం రూ.13 లక్షల విలువ గల ఎల్వోసీలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం మంజూరు చేయించారు. గన్నవరానికి చెందిన ఏడుగురు రోగులు వివిధ కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా వైద్య చికిత్సకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా ఎల్వోసీల పత్రాలను MLA అందజేశారు.

October 12, 2025 / 03:54 PM IST

గుర్తుపట్టలేనంత విధంగా మృతదేహం లభ్యం

NLR: సీతారామపురం మండలం పండ్రంగి గ్రామ స్వామి చెరువు సమీపంలో నెట్ వైపు ప్రాంతంలో గుర్తుపట్టలేనంత విధంగా మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా మృతదేహానికి దుస్తులు లేకపోవడం, తలపై బండరాళ్లు పడి ఉండడం, మృతదేహం కుళ్లి ఆడ, మగ అనే స్పష్టత లేకపోవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

October 12, 2025 / 03:52 PM IST

ATM మూసివేత..ఖాతాదారులకు ఇక్కట్లు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు చెందిన ATM మూసి వేయడం వల్ల ప్రజలు, ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నగదు కోసం ATM కేంద్రానికి వెళ్తే నిరాశకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ స్థలం( బెటాలియన్ ) సిబ్బంది కూడా నగదుకు వస్తుంటారు. ATM తెరిచినా నగదు ఉన్నట్లేదని బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.

October 12, 2025 / 03:51 PM IST

ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయండి: ఎంపీ

KKD: పిఠాపురం పట్టణంలోని RRBHR కళాశాల క్రీడా మైదానాన్ని ఆదివారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మైదానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి స్థానిక క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలు అందించే దిశగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు.

October 12, 2025 / 03:49 PM IST

కోడి పందాలు స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

GNTR: ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందం ఇవాళ పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని వెనిగండ్ల శివారులో కోడిపందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు, 2 కోళ్లు, 38 కోళ్ల కత్తులు, 7 సెల్ ఫోన్లు, 17 బైక్‌లు, రూ.10,600/- నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను విచారణకు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

October 12, 2025 / 03:47 PM IST