• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎస్సీ వర్గీకరణ కోసం ఐక్యంగా పోరాడుదాం

NLR: నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ భవన్‌లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ మాదిగ సంఘాల నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతి ఒక్కరు విభేదాలను వీడి ఐక్యంగా పోరాడాలని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య, మాదిగ జేఏసీ నేత గడ్డం శేఖర్‌లు పిలుపునిచ్చారు.

December 15, 2024 / 02:23 PM IST

శారీరక దారుఢ్య పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి

SKLM: పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా శారీరక అర్హత దారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎచ్చెర్లలో ఉన్న జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానం ఆయన పరిశీలించారు. శారీరిక దారుర్య పరీక్షలు నిర్వహణకు ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఏర్పాట్లు జరగాలని అధికారులను సూచించారు.

December 15, 2024 / 02:22 PM IST

కొల్లు రవీంద్రని పరామర్శించిన బీసీ నాయకులు

కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ ఇటీవల మృతిచెందారు. ఆదివారం తిరువూరు నియోజకవర్గ టీడీపీ బీసీ నాయకులు మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర కార్యాలయానికి వెళ్లి మంత్రిని పరామర్శించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు శేషగిరిరావు, మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ హుస్సేన్, శ్రీనివాసరావు, శీను, తదితరులు పాల్గొన్నారు.

December 15, 2024 / 02:21 PM IST

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే బుడ్డా

 KRNL: శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ వేద పండితులు, ఈవో శ్రీనివాస రావు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ఇరుముడి సమర్పించి, శివదీక్షను విరమించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.

December 15, 2024 / 02:19 PM IST

‘నేడు శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు’

కడప నగర శివారు పరిధిలోని శిల్పారామంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామ పరిపాలనాధికారి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా.. కళావేదికపై సాయంత్రం 6:15 నిమిషాలకు పులివెందులకు చెందిన ఓ డాన్స్ అకాడమీ బృందంచే శాస్త్రీయ, సినీ, జానపద గీతాలకు చిన్నారులు నృత్యాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

December 15, 2024 / 02:11 PM IST

గురజాలలో శాఖాహారమే తినాలంటూ ర్యాలీ

GNTR: గురజాల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో శ్రీ త్రిపురాంతక లుంబినీ పిరమిడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవులు ప్రతి ఒక్కరూ మాంసాహారం వద్దు శాఖాహారమే తినాలి అంటూ శాఖాహార మద్దతుదారులు ప్లకార్డులతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖహారులు మానవులు ఏ జీవిని చంపే హక్కు లేదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

December 15, 2024 / 02:05 PM IST

రేపు పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

KKD: ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం నియోజక వర్గం స్థాయిలో పిఠాపురంలో ఈ నెల16, సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి 01:00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

December 15, 2024 / 02:04 PM IST

‘పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన శాసనమండలి ఛైర్మన్’

W.G: భీమవరం పట్టణంలోని మావుళ్ళమ్మ ఆలయం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయనను మరవదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

December 15, 2024 / 01:53 PM IST

‘పేదల వైద్యానికి కేంద్రం ప్రాధాన్యత’

W.G: పేదల వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఈతకోట తాతాజీ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణ కడగట్ల జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

December 15, 2024 / 01:48 PM IST

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్

కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్ వెళ్లిన పవన్ తిరిగి గన్నవరం చేరుకున్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

December 15, 2024 / 01:47 PM IST

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ

ATP: గుంటూరులోని హిందూ కళాశాలలో ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 1984 -87లో బీఎస్సీ జువాలజీ విభాగంలో డిగ్రీ,ఈ కళాశాలలో చదివినందుకు చాలా గర్వంగా ఉందని 37 సంవత్సరాల తర్వాత ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు.

December 15, 2024 / 01:44 PM IST

నంద్యాల మీదుగా వెళ్లే ప్యాసింజర్ రద్దు

NDL: గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా నంద్యాల మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ ప్యాసింజర్ రైలు(17228)ను 10రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26 వరకు రద్దు చేశారు. డోన్-గుంటూరు రైలును 17- 27 వరకు రద్దు చేశారు. పూరి – గిద్దలూరు – యశ్వంత్ పూర్ (22883) రైలును డోన్ మీదుగా వెళ్లట్లేదని తెలిపారు.

December 15, 2024 / 01:44 PM IST

నంద్యాల మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైలు రద్దు

NDL: గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా నంద్యాల మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ ప్యాసింజర్ రైలు(17228)ను 10రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26 వరకు రద్దు చేశారు. డోన్-గుంటూరు రైలును 17- 27 వరకు రద్దు చేశారు. పూరి – గిద్దలూరు – యశ్వంత్ పూర్ (22883) రైలును డోన్ మీదుగా వెళ్లట్లేదని తెలిపారు.

December 15, 2024 / 01:44 PM IST

పోలీస్ శాఖ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి

VZM: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వర్ధంతిని విజయనగరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్బంగా ఎ.అర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకోసం ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించారన్నారు.

December 15, 2024 / 01:43 PM IST

పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివి: మంత్రి

NDL: అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ అన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతిధులు పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.

December 15, 2024 / 01:40 PM IST