PLD: దాచేపల్లి(మం) పెదగార్లపాడులో ఓ పురాతన విగ్రహం బయటపడింది. జిల్లా పరిషత్ హైస్కూల్లో అభివృద్ధి పనులు చేస్తుండగా ఈ విగ్రహం బయటపడింది. ఇది సీతారాముడు, లక్ష్మణుడు విగ్రహంగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. విగ్రహం ఏ కాలం నాటిది అనే విషయంపై చర్చ జరుగుతోంది.
ATP: చమన్ సాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. డాక్టర్ ఉమర్ ముక్తార్ నేతృత్వంలో సుమారు 3000 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. చమన్ సాబ్ సేవా దృక్పథాన్ని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న నిర్వాహకులను ఎంపీ అభినందించారు.
అన్నమయ్య: పాడి రైతులు ఆవులు, దూడలకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పక వేయించాలని పెద్దమండ్యం పశు వైద్యాధికారి చరిత సూచించారు. గాలికుంటు వ్యాధి అంటువ్యాధి అని ఒక ఆవు నుంచి మరొక అవుకు వ్యాపిస్తుందన్నారు. విపరీతమైన జ్వరం, గిట్టల మధ్య పుండ్లు, పాల ఉత్పత్తి తగ్గడం, చొంగ కార్చడం వ్యాధి లక్షణాలన్నారు.
CTR: చిత్తూరు రూరల్ మండలం తుమ్మింద పాలెం గ్రామంలో జరుగుతున్న శ్రీ ధనకొండ గంగమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక కూటమి నాయకులు, ఉత్సవ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
NLR: మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటని కోవూరు ఎమ్మెల్యే, TTD పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇవాళ తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్లోని పద్మావతి ఆడిటోరియంలో బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత సమాజం కోసం అందరం పాటు పడదాం అన్నారు.
AKP: జిల్లాలో ఈనెల 16 నుంచి రైతన్న-మీకోసం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. నీటీ భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ సహకారం ప్రదాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు రాబోయే ఎల్ నినోపై సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
PLD: విజయవాడ నుంచి అమరావతి వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముందు టైరు పంచర్ కావడంతో రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అమరావతిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
NDL: అవుకు పట్టణంలో ఇవాళ జనసేన నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రక్తం ఇచ్చిన వారికి మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు.
ప్రకాశం: జరుగుమల్లి(మం) కేబిట్రగుంట గ్రామసమీపంలోని పాలేరువాగులో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. మృత దేహంను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలురిమ్స్కు తరలించారు. మృతుడి వివరాలు తెలియక పోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో SMలో, ఇతరపోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.
E.G: నల్లజర్ల మండలం అయ్యవరంలో జనసేన నాయకులు మానవత్వం చాటుకున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన పాము వెంకటలక్ష్మి కుటుంబానికి ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. సొసైటీ డైరెక్టర్ గుడిసె శివకృష్ణ ఆధ్వర్యంలో రూ.20 వేల నగదును దొడ్డిగర్ల సువర్ణరాజు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండబాబు, బాపిరాజు పాల్గొన్నారు.
KDP: వేములలో సోమవారం రైతన్న మీ కోసం నిర్వహిస్తున్నట్లు ఏfy ఓబులేసు ఆదివారం తెలపారు. మండలంలో 6,224 మంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకు, 23 నుంచి 25 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో సోమవారం నుంచి ఆరు రోజుల పాటు ‘రైతన్న సేవలో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బీ. రామాంజనేయులు తెలిపారు. ప్రతి రైతును కలిసి కూటమి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని ఆదివారం ఆయన పేర్కొన్నారు. గుంటూరు విద్యానగర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
SKLM: జి.సిగడాం మండలం దేవరవలస గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు వైసీపీలో ఆదివారం చేరారు. మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాకర్ల నీలకంఠం నేతృత్వంలో పది కుటుంబాలు పార్టీలో చేరాయి. వైఎస్ జగన్ని, గొర్లె కిరణ్ కుమార్ని బలపరుస్తామని వారు తెలిపారు.
ELR: మెయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు స్టేషన్ బెయిల్ లభించింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయనకు, ప్రియాంక రెడ్డికి నోటీసులు జారీ చేసి బెయిల్ మంజూరు చేశారు. శనివారం రాత్రి ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
VZM: చీపురుపల్లి ఆంజనేయపురంకి చెందిన గుడ్ల శ్యామసుందర్ (70) ఆస్తమా వలన ఆదివారం మరణించారు. అయన భార్య గుడ్ల రమణమ్మ, కుమార్తెలకి మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గోవిందరాజులు నేత్రదానంపై అవగాహన పరిచారు. వారు నేత్రదానం చేయడానికి అంగీకరించడంతో టెక్నీషియన్ వచ్చి ఆయన కార్నియాను సేకరించి విశాఖపట్నం హాస్పిటల్కి తరలించారు.