E.G: కొవ్వూరు మండలం వేములూరులో కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనుల కారణంగా శుక్ర, శనివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఈ 2రోజులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అగ్రికల్చర్ సర్వీసులకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.