• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని స్థానిక SDGS కళాశాలలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ.. 15 కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయన్నారు. జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి నెలకి రూ.10 వేల నుంచి రూ. 35 వేలు జీతం ఉంటుందన్నారు.

October 10, 2025 / 05:19 PM IST

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక గ్రామంలోని జూనియర్ కాలేజీలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ భద్రతపై (డయల్ 1930), పిల్లల రక్షణ చట్టం (POCSO Act), గంజాయి వ్యసన దుష్పరిణామాలు గురించి వివరించారు. అత్యవసర సేవల కోసం డయల్ 112కు డయల్ చేయాలన్నారు. విద్యార్థులు సామాజిక బాధ్యతతో ప్రవర్తించి, చట్టాలను గౌరవించాలని ఎస్సై సూచించారు.

October 10, 2025 / 05:16 PM IST

‘ఐద్వా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి’

AKP: అనంతపురంలో ఈనెల 13 నుంచి జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా నాయకులు ఎల్.గౌరీ, కేవీ.సూర్యప్రభ తెలిపారు. నర్సీపట్నంలో శుక్రవారం మహిళలతో సమావేశమయ్యారు. ప్రభుత్వాలు మారుతున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాత్రి సమయాల్లో కూడా మహిళలు పని చేయాలని కూటమి ప్రభుత్వం చట్టం చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.

October 10, 2025 / 05:13 PM IST

గోకవరంలో గంజాయి ముఠా అరెస్ట్

E.G: గోకవరం మండలంలోని తానా సెంటర్ వద్ద శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా స్కూటీపై గంజాయి తరలిస్తున్న రాజమండ్రికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కోరుకొండ సీఐ సత్య కిషోర్ తెలిపారు. ముద్దాయిలు చింతల మురారి, సూరి హేమంత్, దూలపల్లి నానిలను అరెస్ట్ చేశామన్నారు.

October 10, 2025 / 05:12 PM IST

పోలీస్ శాఖ కార్యాలయంలో వెల్ఫేర్ డే

VZM: జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే శుక్రవారం ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే వారి సంక్షేమానికి మొదట ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.

October 10, 2025 / 05:11 PM IST

‘కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’

ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న క్లీనింగ్, స్వీపింగ్ కార్మికులను ఎటువంటి నోటీసులేకుండా, ఎటువంటి నోటీసు లేకుండా తొలగించడం అన్యాయమని ఏఐటీయుసీ నాయకులు బాలిరెడ్డి అన్నారు. ఈ మేరకు కనిగిరి లేబర్ అధికారికి శుక్రవారం ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. కాగా, విధుల నుంచి తొలగింపుకు గురైన కార్మికులు డిపో మేనేజర్‌ను కలిసి ఎందుకు తొలగించాలంటే సమాధానం ఇవ్వలేదన్నారు.

October 10, 2025 / 05:09 PM IST

గుడివాడలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ

కృష్ణా: ఉచితంగా విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చేస్తే ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. గుడివాడలోని వైసీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ పోస్టర్‌ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు.

October 10, 2025 / 05:06 PM IST

మైదుకూరు ఆరుగురు ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు అరెస్ట్

KDP: మైదుకూరు పోలీసులు శుక్రవారం రైతుల పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైర్లు దొంగతనం చేస్తున్న ఆరుగురు దొంగలను అరెస్ట్ చేశారు. DSP రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల నుండి ఒక బొలెరో, 3 బైకులు, సుమారు రూ.2 లక్షల విలువైన 150 కిలోల కాపర్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయినవారు నెల్లూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.

October 10, 2025 / 05:04 PM IST

బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ దేశానికే ఆదర్శం: CM

NLR: వెంకటాచలం (M) ఈదగాలిలో ఏర్పాటు చేసిన బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ద్వారా 200 లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇదొక ఇన్నోవేటివ్ ప్రాజెక్టు అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ఆలోచనలను అందిపుచ్చుకోవడం గొప్ప విషయమన్నారు. వినూత్నంగా కరెంటును ఉత్పత్తి చేసే విధానానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు.

October 10, 2025 / 05:03 PM IST

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ

VZM: జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగ్జిబిషన్ కం సేల్ నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో శుక్రవారం వీసీ నిర్వహించి పలు సూచనలు అందజేశారు. మండల స్థాయి, నియోజకవర్గం, మున్సిపాలిటీ మరియు జిల్లా స్థాయిలో ఈ ఎగ్జిబిషన్‌లు జరగాలన్నారు. ప్రజలకు GST అవగాహన కల్పించాలన్నారు.

October 10, 2025 / 05:02 PM IST

ట్రాఫిక్ రూల్స్‌పై విద్యార్థులకు సీఐ అవగాహన

KKD: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే క్షేమంగా ఇంటికి వెళ్లొచ్చని కాకినాడ ట్రాఫిక్ వన్ సీఐ నూనె రమేష్ అన్నారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. తల్లిదండ్రులకు ట్రాఫిక్ రూల్స్ గురించి పిల్లలు వివరిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ తదితర అంశాలపై సీఐ వివరించారు.

October 10, 2025 / 05:00 PM IST

ఎస్పీను కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ‌ఛైర్మన్ పోతుగుంట

అన్నమయ్య: రాయచోటలోని SP కార్యాలయంలో శుక్రవారం అన్నమయ్య జిల్లా SP ధీరజ్‌ను శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛై‌ర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బొకే అందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని శాంతిభద్రతల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, 20 సూత్రాల కమిటీ ఛై‌ర్మన్ లంక దినకర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

October 10, 2025 / 04:59 PM IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

KRNL: పత్తికొండ మండలం చిన్నహుల్తిలో ఎమ్మెల్యే కేయి శ్యాంబాబు సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ అధికారుల సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు. ప్రభుత్వం 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులను కోరారు.

October 10, 2025 / 04:58 PM IST

‘విద్యార్థులు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి’

SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెల వలసలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బేతన స్వామి మాట్లాడుతూ.. పెద్దలను గౌరవించడం, క్రమశిక్షణతో కూడిన విద్య, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య కౌన్సిలర్ సుగుణ పాల్గొన్నారు.

October 10, 2025 / 04:52 PM IST

నంద్యాలలో వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: నంద్యాల పట్టణంలో శుక్రవారం వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీని బలోపేతం చేస్తామని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.

October 10, 2025 / 04:50 PM IST