GNTR: తాడేపల్లిలోని సీతానగరం బోట్ యార్డ్ వద్ద గల బకింగ్ హమ్ కాలువ సమీపంలోని చెట్లల్లో ఓ వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.మృతుడు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన తిరుమల కొండలు (45)గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.