VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర, ఆన్లైన్ విద్యా కేంద్రంలో ఉగాది సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ ఆచార్య నాయుడు మాట్లాడుతూ.. ఉద్యోగులందరూ కలిసి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. మహిళా సిబ్బంది వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
PLD: శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలోని శ్రీ అడివి పేరంటాలమ్మ అమ్మవారి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
NDL: జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించాలని డోన్లో జర్నలిస్ట్ నాగరాజు గురువారం విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 25 వేల మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారికి పెన్షన్ పథకం అమలు చేయాలని, తమిళనాడు తరహాలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు.
VZM: జాబ్ కేలండర్ ఒక ప్రకటన మాత్రమే కాదు.. నిరుద్యోగులకు ఒక భరోసా అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు..గురువారం పరాభవనామ ఉగాది పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం పట్ల మంత్రి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో...
W.G: డ్రగ్స్ సేవించి పట్టుబడ్డ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, డ్రగ్స్లో అధికార టీడీపీ నేతలే పట్టుబడటం ప్రజలకు ముఖ్యమంత్రి సంజాయిషీ చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. సీపీఎం చేపట్టిన జిల్లా ప్రజా చైతన్య పాదయాత్ర గురువారం 22వ రోజు పాలకోడేరు మండలంలో మోగల్లు గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది.
NLR: గిరిజన సామాజిక వర్గాల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నెల్లూరు పర్యటన సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గిరిజనుల స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే కలిసి గిరిజన సమస్యలపై ప్రత్యేక మెమొరాండం సమర్పించారు.
ATP: జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు వదంతులను నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వెల్లడించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగానే సాగుతోందని స్పష్టం చేశారు. విదేశీ యుద్ధాల వల్ల సరఫరా ఆగుతుందనే ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ను నిరోధించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
PPM: ప్రత్యేక అధికారి పాలనలోనైనా పార్వతీపురం పురపాలన గాడిలో పడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు పార్వతీపురంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ, టీడీపీ పాలనలో పురపాలన గాడి తప్పిందని ఆరోపించారు.
BPT: ఒంగోలుకు చెందిన పూనూరు పవన్ కుమార్కు చెందిన AP40CA3200 నంబరు గల కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అతనిని చంపుతామని బెదిరించారని బాధితుడు తెలిపాడు. బుధవారం అర్ధరాత్రి 1 గంటల సమయంలో చిన్నగంజాం మండలం కడవకుదురు రైల్వే గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
AKP: ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉన్న మందు గుండు సామగ్రిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న మందు గుండు సామగ్రి విలువ రూ.4,000 వరకు ఉంటుందన్నారు. మందు గుండు సామగ్రి నిల్వ చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మందు గుండు సామగ్రి నిలువ చేస్తే చర్యలు తప్పవన్నారు.
E.G: గోకవరం మండలంలోని సూదికొండ గ్రామ శివారు చెరువు వద్ద కోడి పందేల శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో పది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఐదు కోడిపుంజులు, రూ.1,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బి.నాగమణి తెలిపారు. జాతరల సాకుతో గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ఒక పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్గా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభివర్ణించారు. గురువారం ఎచ్చెర్ల జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్తో కలసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక అంశాలను స్పటిస్తూ Dy.CM కళ్యాణ్ ఆలోచనలకు దగ్గరగా ఉంటూ సినిమా చాలా బాగుందని ప్రసంశించారు.
ASR: ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా సీఎం చంద్రబాబు గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అరకులోయ గ్రామ, వార్డు వాలంటీర్ల యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ నాయకులు ఆనంద్, బుచ్చన్నలు గురువారం అరకులోయలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి 2ఏళ్ళు గడిచిన వాలంటీర్లుకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, తమను నిర్లక్ష్యం చేస్తే పోరాటాలు చేస్తామన్నారు.
SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం హరిశ్చంద్ర పురం, మందస, పాతపట్నం రైల్వే స్టేషన్లలో పలు రైలు హాల్ట్లను ప్రారంభిస్తారు. సాయంత్రం అలికాంలోని రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్రమంత్రి కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె టౌన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధవరం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (27) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, సిద్ధవరం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులు అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.