CTR: రాష్ట్రీయ పోషణ్ మాహ్ను 2025 సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోఖయా బేగం పేర్కొన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో మంచి పౌష్టి ఆహారాన్ని పంపిణీచేయుచున్నామని తెలిపారు. గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, మహిళలు పూర్తి స్థాయిలో పోషకాలు అందే ఆహరం తీసుకోవాలని తెలిపారు.
కోనసీమ: రాయవరం బాణాసంచా కేంద్రంలో జరిగిన అగ్ని పమాదంలో మృతి చెందిన వారి పార్థివ దేహాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రిలో పరిశీలించారు. మృతుల పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. దీపావళి సందర్బంగా బాణాసంచా తయారీ కేంద్రాల యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు, విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కోనసీమ: రాష్ట్ర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ని అమలాపురం నియోజకవర్గ వైసీపీ కో- ఆర్డినేటర్ డా. పినిపే శ్రీకాంత్ని భట్నవిల్లి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నాగ సుధా రాణి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధారాణిని విశ్వరూప్, శ్రీకాంత్ శాలువాతో ఘనంగా సత్కరించారు.
సత్యసాయి: గోరంట్ల మండల కేంద్రంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.
ATP: యాడికి మండలం బోయరెడ్డి పల్లి గ్రామంలో ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి గ్రామ సభ నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
KDP: శివాలపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు చేశారు. నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్య క్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ELR: పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో సీఐ సీహెచ్.రాజశేఖర్ నేతృత్వంలో గురువారం పోలీసులు అకస్మాత్తుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడుల్లో 10 మంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.91,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. పేకాట కోడిపందాలు, మద్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలు జీవితానికి హాని కలిగిస్తాయన్నారు.
TPT: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ను సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత గురువారం తాడిపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై, పార్టీ పరిస్థితులపై మంత్రితో ఆమె చర్చించారు.
VZM: బొండపల్లి మండలంలోని గొట్లాం రైతు సేవా కేంద్రంలో గురువారం పంట కోత ప్రయోగాలపై రైతు సేవా కేంద్రాల ఇన్చార్జిలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ నిర్మల్ జ్యోతి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పంట కోత ప్రయోగాలు పూర్తి జాగ్రత్తతో నిర్వహించాలన్నారు. ఇందులో మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
ATP: కూడేరు సీఐ రాజును సస్పెండ్ చేయాలని ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య అని మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ రాజు వేధింపులకు పాల్పడుతున్నారని, మంత్రి పయ్యావులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని దళిత ప్రజా సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రిజిస్టర్ అడ్డయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య ఉన్నారు.
ELR: నూజివీడు మండలం అన్నవరంలో బాణాసంచా తయారీ & నిల్వ కేంద్రాలపై పోలీసుల గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుడు పదార్థాల నిల్వ సమయంలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనుమతి లేకుండా తయారీ, విక్రయం చేస్తే Explosives Act ప్రకారం చర్యలు తప్పవన్నారు.
CTR: పుంగనూరు మండలం గూడూరు పల్లి సమీపన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 14న మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జాబ్ మేళకు 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ మేరకు పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చేసిన నిరుద్యోగ యువతీ యువకులు తమసర్టిఫికెట్స్తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని అన్నారు.
కోనసీమ: సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ ముమ్మిడివరం బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం గురువారం మూడో రోజుకి చేరుకుంది. కేంద్రం ప్రభుత్వం దాడిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇలాంటివి పునరావృత కాకుండా తగిన కఠిన చట్టాలు చేయాలన్నారు.
CTR: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (AIMSR)లో సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ మేరకు “కాటాస్ట్రోఫీలు, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సేవల ప్రాముఖ్యత” అనే థీమ్తో కార్యక్రమం జరిగింది.