VZM: ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినంగా ఆవిష్కరించబడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డా. కృష్ణ ప్రసాద్ అన్నారు. మంగళవారం మహిళా ప్రాంగణంలోని శిక్షణ పొందుతున్న మహిళలకు న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవం హక్కుల కోసం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
ELR: ఉంగుటూరు మండలంలో CM చంద్రబాబు డిసెంబర్ 1న పర్యటించనున్నారని జిల్లా అధికారులు తెలిపారు. సామాజిక పెన్షన్ పంపిణీ, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందన్నారు. దీనితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. CM పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి, MLA ధర్మరాజు, అప్కాబ్ ఛైర్మన్ వీరాంజనేయులుతో మంగళవారం పరిశీలించారు.
కోనసీమ: కాట్రానికోన మండల పరిధిలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు , అమలాపురం ఎంపీ గంటి హరీష్ టోర్నమెంట్కు శుభారంభం పలికారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు
ATP: కదిరి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహూడ ఛైర్మన్ టి.సి.వరుణ్ను కదిరి జనసేన నేతలు ఆహ్వానించారు. డిసెంబర్ 5న జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జనసేన కదిరి ఇన్ఛార్జి భైరవ ప్రసాద్, చౌదరి, రవికుమార్, రామ్మోహన్, ఇర్ఫాన్ తదితరులు ఆయనను కోరారు.
కృష్ణా: నందివాడ మండలం లక్ష్మీ నరసింహపురం గ్రామంలో చెరువుల నుండి అక్రమంగా మట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దళారులు భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతివేగంగా వెళ్లే ట్రాక్టర్ల వల్ల గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొవాలని వారు కోరుతున్నారు.
కోనసీమ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనను జిల్లా అధికారులు సమన్వయంతో దిగ్విజయం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారులకు సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, పర్యటన నిర్వ హణ తీరును క్షుణ్ణంగా వివరించారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ ఎస్.ఎస్రావు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మండలంలోని చింతలపాలెం, గొట్టమిల్లు, హజరత్ గూడెం గ్రామాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
ATP: బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయరుకు ఇన్ ఫ్లో 2,680, ఔట్ ఫ్లో 2,680 క్యూసెక్కులు ఉన్నట్లు హంద్రీనీవా అధికారులు మంగళవారం తెలిపారు. రిజర్వాయర్లో ప్రస్తుతం 1.743 టీఎంసీల నీరు ఉందని, ఇక్కడి నుంచి ఫేజ్-2కు 1,317 క్యూసెక్కుల నీరు వెళ్తందని వెల్లడించారు.
EG: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 27వ తేదీన విజయనగరం జిల్లా కలెక్టర్తో సహా అధికారులతో సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి.
GNTR: తుళ్ళూరు మండలం మందడం ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సైక్లింగ్ పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని ధరణి ద్వితీయ స్థానం సాధించింది. గుంటూరు జిల్లా నుంచి పాల్గొని ట్రాక్ ఈవెంట్లో 2వ స్థానం సాధించి రాష్ట్రం నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 10 గంటలకు గజ పటాన్ని అవనతం చేసి, ఆహ్వానించిన దేవతలను సాగనంపారు. ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నవారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో పాటు విషమృత్యు నాశనం, రాజ్యపదవులు వంటి సకల శ్రేయస్సులను పొందుతారని ఐతిహ్యం.
KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ బుధవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:45 గంటలకు కత్తిపూడిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ములగపూడిలో ఎంపీ సానా సతీష్ బాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్తో కలిసి అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు.
TPT: తిరుపతిలోని తాత్యయగుంట గంగమ్మ ఆలయ విస్తరణ కోసం ఆర్యవైశ్య సంఘం మంగళవారం ఆరు లక్షల వెయ్యిన్ని నూట పదహారు రూపాయల విరాళం అందించింది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా పాలకమండలి ఛైర్మన్ మహేష్ యాదవ్కు ఆర్యవైశ్య సంఘం నేతలు దిండుకుర్తి నరసింహులు ఈ చెక్కును అందజేశారు.
CTR: పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదని రైతులు వాపోతున్నారు. మండలంలోని దేవళంపేట పంచాయితీలో మంగళవారం వేకువజామున ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసిందన్నారు. రైతులు గిరి కుమార్ రెడ్డి , రవి, సుధాకర్ తదితర రైతులకు చెందిన వరి, మామిడి, పశు గ్రాసం పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసిందని విద్యుత్ మోటారు, నీటి పైపులు, గేటు వాళ్లను ఏనుగు విరిచేసింది.
CTR: GD నెల్లూరు మండలం ఎట్టేరి పరిధిలో శనివారం ముగ్గురు వ్యక్తులు వెళ్తున్న బైకుని ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కోటాగరం, ఈ. ఆర్ కండిగకు చెందిన అరుణాచలం, కుమార్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కోటాగరంకి చెందిన దేశయ్య అనే మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.