• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నూతన ఉపాధ్యాయ కరదీపిక-2025 పుస్తక ఆవిష్కరణ

ASR: జిల్లా ఏపీటీఫ్ (ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) అధ్యక్షుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం పాడేరులో నూతన ఉపాధ్యాయ కరదీపిక-2025 పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీ.బ్రహ్మాజీరావు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేతలు పాల్గొన్నారు.

October 9, 2025 / 01:49 PM IST

వాడపల్లి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ మంత్రికి ఆహ్వానం

కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 2025 అక్టోబర్ 10 నుండి 18వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఆలయ ఈఓ చక్రధరరావు అమరావతి‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ మంత్రి కింజారపు కింజరాపు అచ్చెన్నాయుడు‌ని మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు.

October 9, 2025 / 01:49 PM IST

జీఎస్టీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి: జాయింట్ కలెక్టర్

GNTR: గుంటూరు నియోజకవర్గ స్థాయిలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ జీఎస్టీ ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయడంతో జీఎస్టీ తగ్గింపు, పండగల ఆఫర్ కలిసి వస్తువులపై ప్రజలకు అవగాహన వస్తుందన్నారు.

October 9, 2025 / 01:42 PM IST

రేవనూరు గ్రామంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ గురువారం పర్యటించారు. బెలుము గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు హుసేని మనవడి కేశఖండన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

October 9, 2025 / 01:35 PM IST

శ్రీవారి సన్నిధిలో తణుకు ఎమ్మెల్యే

W.G: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. అలాగే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

October 9, 2025 / 01:34 PM IST

వైసీపీ చర్యలను ఖండిస్తూ టీడీపీ నిరసన

VZM: చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం, దేవళంపేటలో వాసీపీకి చెందిన వారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు కోండ్రు మురళీ మోహన్, అదితి గజపతి రాజు, ఎస్సీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో బాలాజీ జంక్షన్‌లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం వైసిపి చర్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు.

October 9, 2025 / 01:33 PM IST

రతన్ టాటాకు ఎమ్మెల్యే నివాళి

W.G: గొప్ప మానవతావాది, ఆదర్శ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా వర్ధంతి సందర్భంగా గురువారం ఉండి నియోజకవర్గంలోని పెద అమిరం గ్రామంలో రఘురామకృష్ణ రాజు ఏర్పాటు చేసిన రతన్ టాటా కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడతూ.. జనవరి 6న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు.

October 9, 2025 / 01:31 PM IST

అనంతపురంలో అత్యధిక వర్షపాతం నమోదు

అనంతపురం నగరంలో ఈ సీజన్‌లోనే అత్యధికంగా గురువారం 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 81 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిందని పేర్కొన్నారు. అలాగే, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

October 9, 2025 / 01:29 PM IST

మున్సిపల్ మేనేజర్‌కు కమిషనర్‌గా పదోన్నతి

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ మేనేజర్ పి. ఆర్. మనోహర్ కమిషనర్‌గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్, సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు మరో ఐదు మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మీరు త్వరలో ప్రభుత్వం కేటాయించిన మున్సిపల్‌లో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.

October 9, 2025 / 01:25 PM IST

జిల్లాలో వేగంగా రోడ్డు నిర్మాణ పనులు

NDL: కొలిమిగుండ్ల నుంచి పెట్టికోట వరకు రోడ్డు నిర్మాణ పనులు ఇవాళ శరవేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తారు రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేయిస్తున్నారు. తారు రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

October 9, 2025 / 01:22 PM IST

ట్రైన్ కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి

NLR: నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ చదువుతున్న సంతోష్(17) ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. వరదయ్య పాలెంకు చెందిన సంతోష్ వెంకటాచలం వద్ద ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు ముగించుకొని తడ నుంచి వెంకటాచలానికి ఫ్రెండ్స్‌తో ట్రైన్‌లో నాయుడుపేట వద్దకి వచ్చేసరికి అదుపుతప్పి ట్రైన్ కిందపడి మృతి చెందినట్లు ఫ్రెండ్స్‌ తెలిపారు.

October 9, 2025 / 01:22 PM IST

మురుగునీరు సమస్యతో గ్రామస్తులకు ఇబ్బందులు

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డుపై మురుగునీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గురువారం వాపోయారు. మురుగునీరు కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి, మురుగునీరు తొలగించాలని కోరుతున్నారు.

October 9, 2025 / 01:17 PM IST

‘ఆటో వర్కర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి’

ప్రకాశం: ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వెలిగండ్ల CIU నాయకులు మాలకొండయ్య అన్నారు. గురువారం ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తాసిల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన వాహన మిత్ర కార్యక్రమంలో, కొద్దిమందికి మాత్రమే డబ్బులు వచ్చాయని మిగతా వారికి వచ్చేలా చూడాలన్నారు.

October 9, 2025 / 01:15 PM IST

పేలుళ్లు ఘటన స్థలాన్ని పరిశీలించిన వైసీపీ నేతలు

కోనసీమ: రాయవరం మండలం కొమరిపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుళ్ల ఘటన స్థలాన్ని గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి మండపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలవాలని కోరారు.

October 9, 2025 / 01:13 PM IST

అభివృద్ధి ప్రదాత ఎంవీ కృష్ణారావు

కృష్ణా: అభివృద్ధి ప్రదాత కృష్ణారావు అని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ అన్నారు. అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ, తెలుగు జాతి రత్నం స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గురువారం ఎంవీ కృష్ణారావు విగ్రహానికి మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామ కూటమి నాయకులు నివాళులర్పించారు.

October 9, 2025 / 01:12 PM IST