అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఘనంగా ముగిసింది. జాతర సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.