• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన డిప్యూటీ ఎంపీడీవో

AKP: ఎస్. రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మండలంలోని తిమ్మాపురం, పెదగుమ్ములూరు పంచాయతీల్లో జరుగుతున్న మంగళవారం పారిశుద్య పనులను పర్యవేక్షించారు. ప్రతీ ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని క్లాప్ మిత్రలకు సూచించారు. అనంతరం సంపద తయారీ కేంద్రం వర్మీ కంపోస్టు తయారు చేయాలన్నారు.

November 25, 2025 / 03:25 PM IST

మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు..!

VSP: ట్రాఫిక్ చలాన్‌లను చెల్లించేందుకు విశాఖ పోలీసులు కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు PhonePay యాప్‌లో eChallan & icon enable చేసి, eChallan ఐకాన్ సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి, వాహన నెంబర్‌ను ఎంటర్ చేస్తే వాహనంపై ఉన్న చలానాలన్నీ కనిపిస్తాయి. అక్కడ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.

November 25, 2025 / 03:25 PM IST

ఆచంటలో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

W.G: ఆచంట మండలం కొడమంచిలి శివారు బి.పి చెరువుకు చెందిన కలగట శ్రీనివాస్ ఈనెల 18న తన వ్యక్తిగత పనుల నిమిత్తం తాడేపల్లిగూడెం వెళ్లాడు. సాయత్రం అయినా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో మంగళవారం కుటుంబ సభ్యులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

November 25, 2025 / 03:20 PM IST

‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KKD: రైతుల్ని రాజులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం ఆలోచన అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో జరిగిన ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ పైడిపాల సూరిబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ‘రైతన్న మీకోసం’ పత్రాలు పంచారు.

November 25, 2025 / 03:20 PM IST

రైతన్న మీకోసం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జెఏవో

VZM: రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో రైతుల సర్వేను జిల్లా వ్యవసాయ అధికారి వి.టీ.రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అందరూ కార్యక్రమంలో పాల్గొని, పూర్తి వివరాలను అడిగి తెలుసుకోవాలన్నారు. ఇందులో ఇంఛార్జ్ తహసీల్దార్ సునీత, MAO రామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

November 25, 2025 / 03:20 PM IST

‘ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి’

ప్రకాశం: మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జాతీయ వ్యాయామ దినోత్సవం వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ రంగయ్య మాట్లాడుతూ.. వ్యాయామం చేయుట ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని తెలిపారు.

November 25, 2025 / 03:20 PM IST

ఆధార్ కేంద్రం లేక ప్రజలకు ఇబ్బందులు

KDP: తొండూరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేక రెండు నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఇక్కడ కేంద్రం ఉండగా, ఇప్పుడు అది ఇనగలూరు సచివాలయానికి మార్చేశారు. అక్కడ ఇంటర్‌నెట్ సమస్యలు, సాంకేతిక లోపాల కారణంగా పనులు సాగడం లేదు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాన్ని తిరిగి తొండూరు సచివాలయంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

November 25, 2025 / 03:17 PM IST

ఈనెల 5నుంచి చిత్తూరులో గరికపాటి ప్రవచనాలు

CTR: చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో డిసెంబర్ 5, 6, 7వ తేదీల్లో చిత్తూరు నారాయణ సేవాసమితి ఆధ్వర్యంలో డా.గరికపాటి నరసింహారావు ప్రవచనాలు నిర్వహించనున్నారు. రోజూ సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8-30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు చిరంజీవి ఓ ప్రకటనలో చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర శతకం ప్రవచనాలను తెలియజేస్తారని. భక్తులు హాజరు కావాలని కోరారు.

November 25, 2025 / 03:14 PM IST

నందివాడలో ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ శిక్షణ

కృష్ణా: ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ శిక్షణ నందివాడ మండలంలో ప్రారంభంకావడం సంతోషకరమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకొని దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.

November 25, 2025 / 03:13 PM IST

అంగన్వాడీ కేంద్రంలో కుల్లిన గుడ్లు సరఫరా

ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని, కంజరిటోట గ్రామం అంగన్వాడీ కేంద్రంలో కుల్లి పోయిన గుడ్లు పెడుతున్నట్టు స్థానికులు తెలిపారు. కాలం చెల్లిన గుడ్లు తినడం వల్ల గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు స్పందించి నాసిరకం గుడ్లు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

November 25, 2025 / 03:13 PM IST

చిన్నారి యశస్వికి కలెక్టర్ అభినందనలు

ATP: జిల్లాకు చెందిన చిన్నారి యశస్వి భారతి 6.9 సెకన్లలో తలతో 100 ట్యూబ్ లైట్లు విరగ్గొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ఘనతకు గాను చిన్నారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో సహా నాలుగు రికార్డులు కైవసం చేసుకుంది. ఈ విజయంపై జిల్లా కలెక్టర్ ఆనంద్.. యశస్వినిని అభినందించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆశీస్సులు అందించారు.

November 25, 2025 / 03:10 PM IST

ఆర్డీవో కార్యాలయం ఎదుట రోడ్డు ప్రమాదం

AKP: నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్‌లో వచ్చి లారీని ఢీ కొట్టాడని స్థానికులు తెలిపారు. కాగా ఘటనలో బైకర్‌ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ద్విచక్ర వాహనం లారీ కింద చిక్కుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. అయితే బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు.

November 25, 2025 / 03:08 PM IST

‘మౌలిక సదుపాయాలు అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం’

కోనసీమ: గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పేర్కొన్నారు. మంగళవారం ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రూ. 42.25 లక్షల వ్యయంతో నిర్మించబోయే రెండు సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, తాగునీరు వంటి అవసరమైన సేవలను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.

November 25, 2025 / 03:08 PM IST

‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

PLD: రెంటచింతల మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి మాన్యంలో వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను రైతులకు వివరించారు.

November 25, 2025 / 03:07 PM IST

అర్హులందరికీ పక్కా ఇళ్లు: కలెక్టర్

VZM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో అర్హత ఉండి ఇళ్లు లేని నిరుపేదల కోసం 100% డిమాండ్ సర్వే జరుగుతోందన్నారు. పేర్లు నమోదు చేసుకోవడానికి ఈనెల 30 వరకు మాత్రమే గడువు ఉందన్నారు.

November 25, 2025 / 03:04 PM IST