• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ హుండీ ఆదాయం లెక్కింపు

KRNL: కోడుమూరు మండలం కల్లపారి దుర్గమ్మ గుడిలో హుండీ ఆదాయాన్ని శుక్రవారం పోలీసుల సమక్షంలో లెక్కించారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఒక హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లిన నేపథ్యంలో, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నారు. లెక్కింపులో రూ. 8,27,309 పాటు బంగారం, వెండి కానుకలు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల కానుకలను పకడ్బందీగా భద్రపరిచారు.

March 27, 2026 / 12:17 PM IST

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

CTR: శ్రీరామనవమి పర్వదినాన్ని చిత్తూరు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వీరాంజనేయ స్వామి ఆలయానికి శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వడపప్పు, పానకాలను పంచిపెట్టారు.

March 27, 2026 / 12:14 PM IST

ఒంగోలులో సీతారాముల దివ్య కళ్యాణోత్సవం

ప్రకాశం: ఒంగోలు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ఆ పవిత్ర వేడుకను కన్నుల పండువగా వీక్షించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో, సంప్రదాయ ఆచార వ్యవహారాల ప్రకారం కళ్యాణం ఘనంగా జరిగింది.

March 27, 2026 / 12:13 PM IST

తుమ్మలగుంటలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం

TPT: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి దంపతులు దగ్గరుండి నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శుభ ముహూర్తంలో శ్రీరాముడు సీతమ్మ మెడలో తాళి కట్టగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు.

March 27, 2026 / 12:12 PM IST

బోరెడ్డిగారిపల్లిలో మంత్రి ప్రజా దర్బార్

అన్నమయ్య: బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు స్వయంగా విని, వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు తమ వినతులను సమర్పించగా, వాటి పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి గారిని పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

March 27, 2026 / 12:11 PM IST

వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం

KRNL: పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలక్ష్మణ దేవాలయంలో శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త ఆర్. రామలింగారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు శేషగిరి జ్యోషి వేద మంత్రాలను పఠిస్తుండగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఇందులో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

March 27, 2026 / 12:06 PM IST

ఒంటిమిట్ట రామాలయంలో బారులు తీరిన భక్తులు

కడప: జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెట్టింగ్ భక్తులను ఆకర్షిస్తోంది. రంగురంగుల పూలతో అలంకరించిన సెట్టింగ్‌ను తిలకించేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తున్నారు.

March 27, 2026 / 12:05 PM IST

గొల్లప్రోలులో రోడ్లపై గోవుల సంచారం

KKD: గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో గోవులు రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయని వాహనదారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. యజమానులు నిర్లక్ష్యంగా పశువులను వదిలేయడంతో ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 27, 2026 / 12:00 PM IST

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NLR: కావలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ధర్మబద్ధమైన జీవన విధానం అందరికీ స్ఫూర్తినివ్వాలని, సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

March 27, 2026 / 12:00 PM IST

‘ఎన్టీఆర్ మార్గ్‌లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు’

ATP: అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు MMD. ఇమామ్ హర్షం వ్యక్తం చేశారు. గత నవంబర్‌లో జిల్లా గ్రీవెన్స్‌లో ఆయన అందజేసిన వినతిపై స్పందించిన కలెక్టర్ ఓ.ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, కమిషనర్‌లకు ఇమామ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ బ్రేకర్లు ఎంతో అవసరమన్నారు.

March 27, 2026 / 12:00 PM IST

ఏకలవ్యలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

PPM: గుమ్మలక్ష్మీపురంలోని ఏకలవ్య పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. ఏప్రిల్ 4న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ కాండిడేట్ ID, పుట్టిన తేదీతో వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.

March 27, 2026 / 11:53 AM IST

ఎల్విన్ పేటలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

PPM: ఎల్విన్ పేట గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీరాములవారిని పల్లకిలో భక్తులు ఊరేగించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు.

March 27, 2026 / 11:53 AM IST

ఊరేగింపుగా పట్టువస్త్రాలు తీసుకెళ్లిన ఆలయ ఈవో

VSP: సింహాచలం నుంచి విజయనగరంలో రామతీర్థం సీతారాముల కళ్యాణానికి ఈఓ వెంకట్రావు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో బయలుదేరారు. సింహాద్రి అప్పన్న సన్నిధి నుంచి రామతీర్థానికి పట్టువస్త్రాలు తీసుకువెళ్లడం ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ అని అధికారులు తెలిపారు. నాదస్వర వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పట్టువస్త్రాలు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

March 27, 2026 / 11:51 AM IST

నైబర్ హుడ్ వర్క్ స్పేస్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

పల్నాడు జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లకు వర్క్ స్పేస్‌లు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఏపీ నైబర్ భాగంగా వర్క్ స్పేస్‌లను లీజుకు ఇవ్వాలనుకునే వారు (APTS) ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తులు www.apts.gov.in వెబ్‌సైట్లో సమర్పించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 8143650320ను సంప్రదించాలని సూచించారు.

March 27, 2026 / 11:50 AM IST

సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

VZM: శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థంలో శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతి సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు.

March 27, 2026 / 11:47 AM IST