• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నూజివీడు అర్చకునికి ఉగాది పురస్కారం

ఏలూరులో నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో నూజివీడులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉమా కుమార్‌కు ఉగాది పురస్కార అవార్డును కలెక్టర్ వెట్రి సెల్వి ప్రధానం చేశారు. ఈ మేరకు పురస్కార అవార్డు లభించడం పట్ల పలువురు అర్చకులు, సామాజికవేత్తలు శుక్రవారం ఆయనకు అభినందనలు తెలియజేశారు.

March 20, 2026 / 02:49 PM IST

‘మార్కాపురంలో భక్తులకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు’

ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం రైల్వే స్టేషన్‌లో శ్రీశైలం వెళ్లే భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. భక్తుల వివరాలు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, స్వయంగా వారికి ఎమ్మెల్యే వడ్డించారు. భక్తుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.

March 20, 2026 / 02:45 PM IST

ప్రజల సమస్యల పరిష్కరించేందుకు గ్రీవెన్స్

W.G: ప్రజల అర్జీలను, వినతిపత్రాలను పరిశీలించి సత్వర పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇంఛార్జి తోట సీతారామలక్ష్మీ తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 20, 2026 / 02:40 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి సుభాష్

కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రామచంద్రపురంలో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారుల పాల్గొన్నారు.

March 20, 2026 / 02:39 PM IST

‘పట్టాభి విగ్రహంతో పాటు నరసయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి’

కృష్ణా: బందరులో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని నిర్మించడంతో పాటు, కోనేర్ సెంటర్‌లో జండా వీరుడు తోట నరసయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలు, న్యాయవాదులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు వినతిపత్రం అందజేశారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పట్టాభి భవనానికి అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 20, 2026 / 02:35 PM IST

కడపలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

కడప మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర శుక్రవారం 49వ డివిజన్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం బిల్డప్ సర్కిల్ ఈద్గా వద్ద రంజాన్ ఏర్పాట్లను సమీక్షించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

March 20, 2026 / 02:32 PM IST

TTD గో సంరక్షణ ట్రస్టుకు విరాళం అందజేత

TPT: తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు అరణి మదన్ మోహన్ తమ సంస్థ తరఫున టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు. అనంతనం వారిని ఈవో సన్మానించారు.

March 20, 2026 / 02:30 PM IST

దోర్నాల ఘాట్ రోడ్డులో భద్రతా చర్యలు

ప్రకాశం: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన ‘దెయ్యాల మలుపు’ వద్ద ప్రమాదాలను నివారించేందుకు దోర్నాల పోలీసులు ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు చేశారు. ఈ మిర్రర్ ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.

March 20, 2026 / 02:30 PM IST

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజప్ప

KKD: పెద్దాపురం పట్టణంలోని ప్రసన్న ఆంజనేయ కాలనీలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డును పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, జనసేన జిల్లా అద్యక్షులు తుమ్మల రామస్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు రాజు, మున్సిపల్ అధికారులు, కుటమి నాయకులు పాల్గొన్నారు.

March 20, 2026 / 02:30 PM IST

బ్రాహ్మణకోడూరుకు వాసికి సత్కారం

GNTR: అమరావతి రోడ్డులోని అమరావతి బిల్డింగ్స్‌లో కళారత్నాలు సాహితీ సమస్తం ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన కవి సౌపాటి ప్రభాకర్ కవితా గానం ద్వారా ఆకట్టుకున్నారు. నిర్వాహకులు ఆయనను సత్కరించి మెమొంటో, ప్రశంసా పత్రం అందజేశారు. గ్రామస్తులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు.

March 20, 2026 / 02:30 PM IST

బకాయిల చెల్లింపుపై 50% వడ్డీ రాయితీ

PLD: మాచర్ల పురపాలక పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ యంత్రాంగం భారీ ఊరటనిచ్చింది. ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీలోపు బకాయిలను ఒకే మొత్తంగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని చెప్పారు.

March 20, 2026 / 02:30 PM IST

ఎన్టీఆర్ మినరల్ ఆర్వో ప్లాంట్ ప్రారంభం

BPT: కొత్తపేట మూడు రోడ్ల సెంటర్ గోపాల్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మినరల్ ఆర్వో ప్లాంట్‌ను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శుక్రవారం ప్రారంభించారు. ప్లాంట్‌ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

March 20, 2026 / 02:30 PM IST

యువతకు ఉగాది కానుక ‘జాబ్ క్యాలెండర్’

KRNL: కూటమి ప్రభుత్వం ప్రకటించిన 10,060 ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ యువతకు చారిత్రాత్మక కానుక అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు. మే నుంచి అక్టోబర్ వరకు వివిధ శాఖల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.

March 20, 2026 / 02:29 PM IST

యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే

NDL: యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఇప్పటికే 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు కూటమి ప్రభుత్వం కల్పించిందని అన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పుకొచ్చారు.

March 20, 2026 / 02:29 PM IST

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎంఈవో

NLR: ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దళితవాడ పాఠశాలను ఎంఈవో తోట శ్రీనివాసులు శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, పలు రికార్డులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరు, రికార్డులు నిర్వహణపై పరిశీలన చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు.

March 20, 2026 / 02:28 PM IST