KKD: సామర్లకోట మండలం కొప్పవరం జంక్షన్ వద్ద గల రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఎంపీ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చు.