SKLM: యాత్రికులు ప్రయాణం చేసే తుఫాన్ వాహనం డ్రైవర్ సునీల్ సింగ్ పటేల్ నిద్రమత్తులోకి జారిపోవడం వలనే నలుగురు యాత్రికులు స్పాట్లో చనిపోయారని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వై.సత్యనారాయణ ఆదివారం తెలిపారు .తీవ్రంగా గాయపడిన సంతోష్ బాయ్, సీమన్ భాయ్, చీర భాయ్, సావిత్రి భాయ్, శకుంతలా భాయ్, తోమర్లను వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించామన్నారు.
VSP: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సందర్శకులుతో ఆదివారం కిటకిటలాడింది. ఈ రోజు మొత్తం 10,352 మంది సందర్శకులు జూ పార్క్ను సందర్శించారని క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. రూ.7,63,450 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జూపార్క్ అంతా సందడి వాతావరణం నెలకొంది. చిన్న, పెద్ద అంతా కలిసి ఆటపాటలతో కార్తీక వనభోజన చేశారు.
NLR: వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చిన వారు అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోడానికి కాల్ సెంటర్ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇచ్చిన అర్జీకి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.
NLR: మర్రిపాడు మండలం బూదవాడ సమీపంలో 565 జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యక్తి వివరాలు తెలిస్తే మర్రిపాడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని SI శ్రీనివాసరావు కోరారు.
సత్యసాయి: బుక్కపట్నం మండలం మదిరేబైలు గ్రామానికి చెందిన బాలరాజు అనారోగ్యంతో అనంతపురంలోని కుమార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ ఆదివారం ఆసుపత్రికి వెళ్లి బాలరాజును పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
VZM: గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆదివారం సాయంత్రం స్థానిక విజ్జి మైదానంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు.
VSP: విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు (పేదల వైద్యుడు)..తిరుమల ఫీవర్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కే. ప్రకాశరావు తుదిశ్వాస విడిచారు. సుమారు 60 సంవత్సరాలుగా కేవలం రూ. 20 ఫీజుతో వైద్య సేవలు అందించి, వేలాది మంది పేద ప్రజలకు ఆయన చేరువయ్యారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు, స్థానికులు ఘన నివాళులర్పించారు.
CTR: సదుం మండలం గొంగివారిపల్లి రాజీవ్ నగర్లో నూతనంగా నిర్మించిన సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఇవాళ ఘనంగా జరిగాయి. ప్రాణ ప్రతిష్ట, మహా కుంభాభిషేక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులకు ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ELR: వచ్చే నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏడీ రామ్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలకు కలెక్టర్ వెట్రిసెల్వి బహుమతులు అందజేస్తారని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
GNTR: బల్గేరియాలోని అసినోవ్ గ్రాడ్ నగరంలో బల్గేరియన్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సారథ్యంతో ఈ నెల 22న నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంటులో భారత్కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ ధూళిపాళ్ల బాలచంద్ర ప్రసాద్ సత్తా చాటాడు. 9 రౌండ్లకు గాను 7.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలచి ఆదివారం బల్గేరియన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకొన్నాడు.
కడప: రాష్ట్రానికి బీజేపీ ఒక శని లాగా దాపురించిందని, వైసీపీ, టీడీపీలు రాహు, కేతు లాగా ఉన్నాయని రాజ్యసభ మాజీ ఎంపీ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ఖాజీపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు..
E.G: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సత్య సాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన పుట్టపర్తి ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది సాయిబాబా సేవలేనన్నారు. గురుకుల విద్య తమజీవితానికి మార్గదర్శకమైందని వ్యక్తిగతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పండుగగా ఆయన శతజయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం గర్వకారణమన్నారు.
KKD: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని జగ్గంపేట ఎస్సై టీ.రఘునాథరావు వాహనదారులకు హెచ్చరించారు. ఆదివారం జగ్గంపేట గ్రామ శివారు గోకవరం వెళ్లే రోడ్డులో ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. వాహనదారులు బాధ్యతగా మెలగాలని సూచించారు.
VSP: విశాఖలోని శాంతిగిరి కాలనీ కొండ ప్రాంతంలో గత వారం అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన రెండు కుటుంబాలకు వైసీపీ అండగా నిలిచింది. వార్డు అధ్యక్షుడు రేవళ్ల సత్యనారాయణ సేకరించిన రూ. 15 వేల రూపాయలను పార్టీ పశ్చిమ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆదివారం బాధితులకు అందజేశారు.
W.G: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం పాలకొల్లులో జిల్లా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. రిటైర్డ్ జడ్జి జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు.