ATP: CM చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతంలో రాష్ట్రస్థాయి ‘జలధార’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మరోవైపు అదే రోజున అనంతపురంలోని జేఎన్టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.
కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు 6 పడకల డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 9.30 గంటలకు రామచంద్రపురం లెప్రసీ కాలనీలో 30 ఇళ్లకి మరమ్మతు పనుల పరిశీలన కార్యక్రమంలో పాల్గొంటారు.
SKLM: రానున్న రెండు రోజులు జిల్లాలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండి 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనందుకు అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలో 15 మండలాల్లో తీవ్రవడగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు. వడగాలుల కారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కోనసీమ: రామచంద్రపురంలో గురువారం రాత్రి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు గుర్తించడం శుభసూచికమని మంత్రి పేర్కొన్నారు. CM చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి, ప్రధాని మోదీ చొరవతోనే ప్రజల కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
నెల్లూరు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం అల్లూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.
GNTR: జిల్లా సహకార బ్యాంకు లాభాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది రూ.45 కోట్ల లాభం సాధించి ఏకంగా 89% వృద్ధి నమోదు చేసింది. డిపాజిట్లు రూ.222 కోట్లు పెరిగడంతో రూ.1635 కోట్లకు చేరాయి. రాష్ట్ర బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులు రూ.502 కోట్లు తగ్గాయి. కాగా, రైతుల పంట రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఛైర్మన్ మక్కెన మల్లికార్జున తెలిపారు.
NLR: అనంతసాగరం మండలం సంజీవ్ నగర్లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. వాటర్ ట్యాంకుకు ఉన్న పిల్లర్లలో రెండు కాంక్రీట్ ఊడిపోయి ప్రమాదకరంగా మారాయి. గురువారం ప్రజలు మాట్లాడుతూ.. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి స్థానిక ఎస్సై సాంబశివయ్య వాహన తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి వారి డ్రైవింగ్ లైసెన్సులు పరిశీలించారు. ఇటీవల మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
W.G: ఆకివీడు పెదపేట ఆలయ వివాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో డీఆర్వో శివన్నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి, పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
NLR: నమ్మించి అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేయడం వల్ల కుటుంబాన్ని పోషించలేక చావాలనుకున్న ఓ అభాగ్యుడిని పోలీసులు గురువారం రాత్రి కాపాడారు. రవీంద్ర అనే వ్యక్తి మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కందుకూరుకు చెందిన మాధవరావు తన బంధువులకు వీడియో పంపాడు. సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని గుర్తించి కాపాడారు.
KRNL: వెల్దుర్తికి చెందిన 9 ఏళ్ల ఎరుకల జయంత్ అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. జ్వరం, వాంతులు, కడుపునొప్పి, ముఖం వాపుతో బాధపడిన బాలుడిని మొదట స్థానిక PHCలో చేర్పించగా, పరిస్థితి విషమించడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించినట్లు భందువులు తెలిపారు. తల్లిదండ్రులు రమేష్, రాజేశ్వరి దంపతులకు జయంత్ పెద్ద కుమారుడు.
CTR: జిల్లాలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది పత్రాలు, హెల్మెట్, డ్రంక్ డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అక్రమ రవాణా, నేరాలను అరికట్టేందుకు అనుమానాస్పద వాహనాలను పరిశీలిస్తున్నారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.
కోనసీమ: రాష్ట్ర రాజధాని అమరావతి సాధనలో ఏం. ఏ షరీఫ్ పాత్ర కీలకమని ఆయన్ను రాజ్యసభకు పంపాలని TDP రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ గురువారం పేర్కొన్నారు. విజయం అనేది ఒక్కరి కృషి కాదనీ అనేక మంది త్యాగాలు, పోరాటాలు, సహనాల సమాహారం అని అన్నారు. విద్రోహ చర్యలను అధిగమించి పార్లమెంట్ ఉభయ సభల సమ్మతి పొందడం ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు.
TPT: తిరుమలలో శ్రీవారి సేవకు వచ్చిన వ్యక్తి అదృశ్యమయ్యారు. ఆదిలాబాద్కు చెందిన మేకల్యూర్ నర్సింగ్ (55) గత నెల 31న స్థానిక సేవాసదన్ వద్ద తప్పిపోయారు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో భార్య విజయ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలిస్తే 94407 96772కు తెలియజేయాలని కోరారు.
VZM: మునిసిపల్ కమీషనర్ బాలస్వామి గురువారం తన కార్యాలయంలో సచివాలయం అడ్మిన్, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలను ఒప్పించి పన్నులు వసూలు చేయాలని అన్నారు. పన్నులు వసూలు చేసేటప్పుడు ప్రజలకు అవగాహన కల్పించి పన్నువిధింపులు చేపట్టాలన్నారు. పన్నులు చెల్లింపులో ఉన్న 50% రాయితీని విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.