• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కూరగాయల అలంకరణలో వరాల ఆంజనేయుడు

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి కూరగాయల అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆదివారం వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన మాట్లాడుతూ.. పౌర్ణమి పురస్కరించుకొని నేడు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందని తెలిపారు.

December 15, 2024 / 08:21 AM IST

నీటి సంఘం నాయకులను అభినందించిన ఎమ్మెల్యే అశోక్

SKLM: కవిటి రామయ్య పుట్టుగ పార్టీ కార్యాలయంలో శనివారం సోంపేట నీటి సంఘం నాయకులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబును కలిశారు. ఈ మేరకు ఈరోజు జరిగిన ఎన్నికల్లో చీకటి, సోంపేట, గొల్లవాని చెరువు నీటి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తెల్లి యోగేశ్వరరావు, కేత చిరంజీవిలు, టీ. సీ మెంబర్లు కలిశారు. వీరిని ఎమ్మెల్యే అభినందించారు.

December 15, 2024 / 08:14 AM IST

శ్రీ వాసవి అమ్మవారికి మార్గశిర మాస పౌర్ణమి పూజలు

ATP: గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా అమ్మవారి ఆలయంలో ఆదివారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ వేకువ జామున అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు,వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

December 15, 2024 / 08:12 AM IST

పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం

KRNL: రాజంపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన ఫ్రెండ్ బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా, వీరి ఇరువురినీ ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టినరోజు నాడే మృతి చెందాడు.

December 15, 2024 / 08:10 AM IST

‘రాజీతో జిల్లాలో 2937 కేసులు పరిష్కారం’

SKLM: లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 19 బెంచీలు ఏర్పాటు చేసి 2937 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శనివారం తెలిపారు. వాటిలో సివిల్ కేసులు 138, క్రిమినల్ 2,694, వాహన ప్రమాదాలకు సంబంధించినవి 43, ప్రీ లిటిగేషన్ కేసులు 62 ఉన్నట్లు వివరించారు.

December 15, 2024 / 08:10 AM IST

‘362 కేసులకు పరిష్కారం’

NDL: జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించామని మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో సీసీ కేసులు 92, సివిల్ కేసులు 41, క్రిమినల్ కేసులు 118, ఎక్సైజ్ 16 కేసులు చొప్పున మొత్తం 362 కేసులు పరిష్కారం అయ్యాయని న్యాయమూర్తి వాసు తెలిపారు.

December 15, 2024 / 08:07 AM IST

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు

కృష్ణా: హైదరాబాద్‌లో సోమవారం నుంచి 22వ తేదీ వరకు జాతీయస్థాయి సబ్ జూనియర్ U/14 పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టులో కృష్ణా జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు సీనియర్ కోచ్ డాక్టర్ వాకా నాగరాజు తెలిపారు. నూజివీడులో ఆయన శనివారం రాత్రి మాట్లాడుతూ.. క్రీడాకారులు కుసుమ, వాహిని, వర్షిని, మనోబిరామ్ ఎంపికైనట్లు తెలిపారు.

December 15, 2024 / 08:05 AM IST

పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రి

KRNL: బనగానపల్లె పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహిస్తున్న పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొననున్నారు. నేడు జరిగే పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం పొట్టి శ్రీరాములు గురించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరిస్తారు.

December 15, 2024 / 07:57 AM IST

నేడు నూజివీడులో మంత్రి పార్థసారథి పర్యటన

ELR: నూజివీడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మంత్రి పార్థసారథి పర్యటించనున్నారు. ఈ మేరకు పౌర సంబంధాల శాఖ అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. నూజివీడు ప్రాంతంలోని పలు కార్యక్రమాల్లో హాజరుకానున్నట్లు తెలిపారు. ముసునూరు మండలం ఎల్లాపురం, చాట్రాయి మండలంలో మంత్రి పర్యటిస్తారని కావున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

December 15, 2024 / 07:54 AM IST

సీతానగరం రైల్వే గేట్ 4 రోజులు క్లోజ్

BPT: చీరాల మండలంలోని సీతానగరం రైల్వే గేట్ నాలుగు రోజులు మూసివేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ మధ్య గల ప్లాట్ ఫామ్ మరమ్మతు పనుల కారణంగా శనివారం గేటు మూసివేశారు. ఈ గేటు సీతానగరంకు పిలవబడే చీరాల నగరం, పాత చీరాల, కొత్తపాలెం గ్రామాలను కలుపుతుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలు పాతచీరాల, దేశాయిపేట గేట్లను ఉపయోగించుకోవాల్సిందిగా తెలిపారు.

December 15, 2024 / 07:54 AM IST

ప్రత్యేక అలంకరణలో భగవాన్ కాసినాయ

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కొత్తపేటలో కాశినాయన ఆశ్రమంలో భగవాన్ శ్రీ కాశినాయన 29వ ఆరాధన మహోత్సవం సందర్భంగా నేడు కాశినాయన ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భజన కార్యక్రమం, తదుపరి భక్తులకు అన్నప్రసాదం వితరణ ఉంటుందని ఆలయ కమిటీ వారు తెలిపారు. భక్తులు అందరు తరలి వచ్చి కాసినాయన కృపకు పాత్రులు కావాలని కోరారు.

December 15, 2024 / 07:45 AM IST

పర్యాటకుల కోసం కృష్ణాపురం ఎకో టూరిజం ప్రాజెక్టు

ASR: చింతపల్లి మండలంలోని కృష్ణాపురంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. కృష్ణాపురం పైన్ తోటల్లో శనివారం నుంచి పర్యాటకుల కోసం క్యాంపు ఫైర్ టెంట్లు ఏర్పాటు చేశారు. ఎకో టూరిజం ప్రాజెక్టు వద్ద పచ్చని గార్డెన్, 4 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ పాత్, 25 టెంట్ హట్లు, విద్యుత్ సౌకర్యం, గ్రీజర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

December 15, 2024 / 07:43 AM IST

చింతపల్లిలో 10.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

ASR: జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతుంది. చింతపల్లిలో ఆదివారం 10.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. మన్యంలో సాయంత్రం సుమారు 3 గంటల నుండే చలి విజృంభిస్తోంది. రాత్రి సమయంలోనూ అలాగే ఉదయం సుమారు 9.30 గంటల వరకు పొగమంచు కురుస్తోంది.

December 15, 2024 / 07:42 AM IST

మంత్రి రవీంద్రని పరామర్శించిన MLA తాతయ్య

కృష్ణా: రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం మచిలీపట్నం (బందర్)లో వారి నివాసానికి వెళ్లి మంత్రి కొల్లు రవీంద్రని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

December 15, 2024 / 07:37 AM IST

లోక్ అదాలత్‌లో 126 కేసులు పరిష్కారం

కోనసీమ: అమలాపురం కోర్టుల సముదాయంలో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో రూ.17 కోట్ల 93 లక్షల విలువైన 126 కేసులు పరిష్కారం అయ్యాయి. అమలాపురం జిల్లా రెండో అదనపు కోర్టులో న్యాయమూర్తి వి.నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్‌లో కక్షిదారులు రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకున్నారు. పరిష్కారమైన 126 కేసుల్లో 56 సివిల్ కేసులు, 23 బ్యాంక్ కేసులు ఉన్నాయన్నారు.

December 15, 2024 / 07:32 AM IST