E.G: రాజమండ్రిలోని SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 20, 21 తేదీలలో ‘యువతలో ఆవిష్కరణలు, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధి’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. బి.వి. తిరుపణ్యం తెలిపారు. ఈ సదస్సులో అధ్యాపకులు పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులు పాల్గొని అవసరమైన మెలకువలు నేర్చుకోవచ్చన్నారు.