ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెంకు చెందిన సతీశ్ (25) గురువారం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. కాళ్లలో చెరువు పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సతీశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.