KRNL: ఆదోని శివారు సిరుగుప్ప సర్కిల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన విరుపాక్షి గాయపడ్డారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు టిప్పర్ను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ అబ్దుల్ తెలిపారు.