• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆకివీడు పెదపేట ఘటనలో మరో 10 మంది అరెస్ట్

WG: ఆకివీడు పెదపేటలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలకు సంబంధించి సోమవారం మరో 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. ఈ కేసులో మొత్తం 57 మందిపై కేసులు నమోదు చేయగా, ఇప్పటివరకు 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు భీమవరంలో నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న 17 మందిని బైండోవర్ చేశారు.

March 31, 2026 / 07:55 AM IST

నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు సమకూర్చడమే చంద్రబాబు ప్రభుత్వం సంకల్పమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సోమవారం నిర్వహించిన నూతన గృహప్రవేశం కార్యక్రమం నర్సిపురం గ్రామంలో ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని, నర్సిపురంలో కొత్తగా నిర్మించిన నూతన గృహాలను ప్రారంభించారు.

March 31, 2026 / 07:54 AM IST

మద్యం మత్తులో యువకుల హల్చల్

VSP: కంచరపాలెం ఎస్ఆర్ నగర్‌లో మద్యం, గంజాయి మత్తులో ముగ్గురు యువకులు సోమవారం రోడ్డు మీద హల్చల్ చేశారు. చాకులతో కోసుకొని ఇస్టానుసారంగా వ్యవహరించారు. కాగా, స్థానికులు దీనిని వీడియో తీసి MLA విష్ణుకుమార్ రాజుకు, CPకు పంపి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, సీపీ ఆదేశాలతో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు.

March 31, 2026 / 07:50 AM IST

ఆర్ కొత్తపల్లెలో రీ సర్వే గ్రామ సభ

KRNL: బేతంచెర్ల మండలంలోని ఆర్ కొత్తపల్లె గ్రామ సచివాలయం వద్ద రీ సర్వేపై గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ నాగమణి సోమవారం తెలిపారు. ఆర్ కొత్తపల్లె, ఆర్ బుక్కపురం రైతులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఏపీ సరిహద్దుల చట్టం 1923 సెక్షన్ 9(2) ప్రకారం పట్టాదారులు, ప్రభుత్వ భూములకు నోటీసులు జారీ అవుతాయని పేర్కొన్నారు. రైతులు సమస్యలు తెలియజేయాలని సూచించారు.

March 31, 2026 / 07:46 AM IST

పాము కాటుకి గురై వ్యక్తి మృతి

ELR: కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన పారేపల్లి సురేష్ (36) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. తమ పొలంలో నిమ్మకాయలు ఏరుతుండగా పాము కాటు వేసినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెంటనే కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించగా చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

March 31, 2026 / 07:42 AM IST

నేడు పామిడిలో సుంకం వసూలుకు బహిరంగ వేలం

ATP: పామిడి పంచాయతీ పరిధిలో ఏడాదిపాటు సుంకం వసూళ్ల పనులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఈఓఆర్డీ అశ్వర్ధనాయుడు తెలిపారు. దినసరి మార్కెట్, బస్టాండ్, జంతు వధశాల, తాటిఫలసాయం సుంకపు వసూళ్లకు వేలం ఉంటుందన్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేయాలన్నారు.

March 31, 2026 / 07:41 AM IST

నేడు నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు 2026-27 బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల అమోదానికి సర్వసభ్య సమావేశం జరగనుంది అని అధికారులు తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో జరగనుందని పేర్కొన్నారు. నూతనంగా మేయర్‌గా నియమితులైన సుజాతకు ఇది తొలి సమావేశం కావడం విశేషం అని పలువురు అన్నారు.

March 31, 2026 / 07:40 AM IST

సచివాలయ ఉద్యోగికి ఉత్తమ అవార్డు

PPM: పీ-4 అమలులో ఉత్తమ ప్రతిభ కనపరచిన జీకే వీధి మండలం ధారకొండ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కురుజు ప్రసాద్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. సోమవారం పాడేరులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. తన ట్రస్ట్ ద్వారా ఆయన పలువురు పేదలకు పలు సేవలు అందించారు.

March 31, 2026 / 07:40 AM IST

మద్యం మత్తులో భార్యపై భర్త దాడి.. కేసు నమోదు

W.G: మద్యం మత్తులో భార్యను వేధిస్తున్న భర్తపై పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కె.గంగాధర్ వివరాలు.. సిద్ధాంతం గ్రామానికి చెందిన కర్రి అన్నపూర్ణ(29)ను ఆమె భర్త పల్లపరాజు గత 3నెలలుగా వేధిస్తున్నాడు. సోమవారం మద్యం సేవించి భార్యతో పాటు ఆమె బంధువులపై కూడా దాడికి పాల్పడటంతో విసుగుచెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

March 31, 2026 / 07:35 AM IST

నేడు చల్లబసాయపల్లెకు ఎంపీ రాక

KDP: దువ్వూరు మండలంలోని చల్లబసాయపల్లెలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రం,హెల్త్ క్లినిక్‌ను ఇవాళ ఉదయం 8 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించనున్నట్లు MPP కానాల జయచంద్రారెడ్డి సోమవారం తెలిపారు. MPతోపాటు మైదుకూరు మాజీ MLA శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మాజీ DY CM అంజాద్ బాషా, YCP జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొంటారన్నారు.

March 31, 2026 / 07:33 AM IST

నేడు శ్రీకాకుళంలో జాబ్ మేళా

SKLM: శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు .సాయి కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు.15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500 పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 31, 2026 / 07:33 AM IST

చేబ్రోలులో నేడు మెగా జాబ్ మేళా

ELR: చేబ్రోలులోని గీతాంజలి పాఠశాలలో ఇవాళ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు తెలిపారు. మొత్తం 13 కంపెనీలు ఇందులో పాల్గొని 1,070 పోస్టులను భర్తీ చేయనున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ చేసిన 18- 35 ఏళ్ల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9:30 గంటలకు స్టడీ, ఇతర సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన కోరారు.

March 31, 2026 / 07:32 AM IST

తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్

సుండుపల్లె మండలంలో ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. రాయవరం పంచాయతీ చీనేవాండ్లపల్లెకు చెందిన కాటగాని రమేశ్‌బాబు ఈ నెల 27న బాల్రెడ్డిగారిపల్లెలోని కృష్ణయ్య ఇంటి తాళాలను పగులగొట్టే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారని ఎస్సై తెలిపారు.

March 31, 2026 / 07:32 AM IST

కేతావారిదిబ్బలో క్షుద్రపూజల కలకలం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలంలోని సవరపాలెం కేతావారిదిబ్బలో సోమవారం క్షుద్రపూజల కలకలం రేపింది. 20 బీసీ కుటుంబాలను భయపెట్టేలా ఆకతాయిలు నిమ్మకాయలు, దిష్టిబొమ్మలు, పసుపు కుంకుమలతో ముగ్గులు వేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఎస్సై శేఖర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ ముగ్గులను తొలగింపజేసి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు.

March 31, 2026 / 07:30 AM IST

రేపు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నూకాంబిక ఆలయ చైర్మన్ నాగశ్రీను తెలిపారు. నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా సాయంత్రం 7:00 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

March 31, 2026 / 07:28 AM IST