ATP: గోరంట్ల పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
PLD: నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో ఈనెల 17 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆదివారం మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు తెలియజేశారు. 18,19, 20 వరకు నిర్వహించే ఆధార క్యాంపులను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రకాష్ నగర్ -2 సచివాలయం, రంగా స్ట్రీట్ సచివాలయం-2లో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
VSP: విశాఖలో మద్దిలపాలెంలో వైసీపీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు, వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి మోసాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వరదు కళ్యాణి, మేయర్ హరి వెంకటకుమారి, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు ఉన్నారు.
PPM: బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ ప్రసంశించారు. ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు, పటేల్ వర్ధంతి కార్యక్రమం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
PLD: జనసేన గురజాల నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్ను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అభినందించారు. ఆదివారం పిడుగురాళ్ల పట్టణ టీడీపీ కార్యాలయంలో వెంకట్ను యరపతినేని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాత్రికేయ రంగంలో సీనియర్ జర్నలిస్ట్కి అధికార ప్రతినిధి పదవి రావడం సంతోషకరమన్నారు.
PLD: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలు ఆనిర్వచనీయమని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రహదారిలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు.
NDL: ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని బనగానపల్లెలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిస్వార్ధంగా తన ప్రాణాలను అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా మంత్రి బీసీ కొనియాడారు. కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
SKLM: రణస్థలం మండలం తోటపాలెం గ్రామంలో శ్రీ భద్ర మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కమిటీ సభ్యులకు పలు సూచనలు, సలహాలు తెలిపారు. ప్రతి ఏటా సంక్రాంతి పండగ పర్వదినాన ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
VZM: ఎస్.కోట నియోజకవర్గంలో గల ఐదు మండలాల్లో శనివారం జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం ఆదివారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎల్కోట ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆమె నీటి సంఘం పాలకవర్గానికి తన అభినందనలు తెలిపారు. చెరువులు అభివృద్ధికి, రైతులు సంక్షేమానికి నీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం కృషి చేయాలని కోరారు.
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కొరసవాడ చేనేత కార్మికులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో అర్హత కలిగి ఉన్న చేనేత కార్మికుల సభ్యత్వాన్ని తొలగించారని పేర్కొన్నారు. వెంటనే వారి సభ్యత్వాన్ని నమోదు చేయాలని తెలిపారు.
ఎన్టీఆర్: అమరజీవి పొట్టి శ్రీ రాములు వర్థంతిని ఆత్మ సంతర్పణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం హర్షణీయమని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం నందిగామ పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఆయన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కడప: నగరంలోని ఆర్టీసీ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. వీకెండ్ కావడంతో ఇంట్లోని వారు స్వగ్రామానికి వెళ్ళగా ఇంట్లో దొంగలు చొరబడి బంగారు, నగదును దోచుకెళ్ళారు. ఇంటి వాకిలి తెరిచి ఉండడంతో ఆదివారం ఉదయం స్థానికులు ఫోనులో ఇంటి వారికి తెలుపగా.. వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. విషయాన్ని చిన్నచౌక్ పోలీసులకు చేరవేశారు.
అన్నమయ్య: తల్లిదండ్రులను వృద్ధులను నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముని గోపాలకృష్ణ అన్నారు. ఆదివారం మదనపల్లె పట్టణంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొంతమంది వృద్ధులైన తల్లిదండ్రులను ఇళ్లలో నుంచి గెంటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
NDL: శ్రీశైలంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు ముందుగా దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గణపతి పూజ, దత్తాత్రేయ ఆరాధన, పాలాభిషేకం, పంచామృత అభిషేకం జరిపారు. పలు ప్రాంతాల భక్తుల దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
KRNL: తిరుచానూరులోని శ్రీ క్షేత్రాన్ని మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆదివారం సందర్శించారు. శ్రీ స్వామీజీకి ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉత్సవ స్వీకరణ అనంతరం శ్రీ స్వామిజీ శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య దర్శనానికి వెళ్లారు. ఈ సందర్శనలో శ్రీ స్వామీజీ శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రార్థనలు చేశారు.